వనపర్తి, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : దళితబంధు పథకం దేశంలో సాంఘిక విప్లవానికి నాంది పలుకుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి ని రంజన్రెడ్డి తెలిపారు. ఈ పథకాన్ని ఆర్థిక కోణంలో చూ డొద్దని.. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ దార్శనికతతో రూపొందించినదని అభిప్రాయపడ్డా రు. సమీకృత కలెక్టరేట్లో శనివారం దళితబంధు ఆ త్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళితుల జీవితాల్లో వెలుగులు రావాలనే సీఎం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. స మాజంలో అన్ని రకాలుగా వివక్షతకు, అభివృద్ధికి నోచుకోకుండా ఉన్న దళితులను ఈ పథకంతో ఉన్నతంగా నిలబెడుతామన్నారు. ఇంతటి గొప్ప పథకం ప్రపంచం లో ఎక్కడా లేదని, దీనిని ఎవరూ ఆపలేరన్నారు. తెలంగాణ పథకాలన్నీ దేశానికి దిక్చూచిగా మారాయన్నారు. దళితుల వెనుకబాటు, అభివృద్ధి గురించి తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలోనే అనేక సార్లు చర్చలు జరిపామని, ఇది ఇప్పటికిప్పుడు వచ్చిన ఆలోచన కాదన్నారు. 2009-11 మధ్య కాలంలో దళిత మేధావుల తో చర్చించినట్లు స్పష్టం చేశారు.
సమాజంలో ఆకలితో ఉన్న అట్టడుగు వర్గాలైన దళితులకు మొదటి బంతిలో దళితబంధు భోజనం పెట్టామన్నారు. తెలంగాణను చూసి దళితబంధును ఇప్పటికే నాలుగు రాష్ర్టాల్లో అమలుచేస్తున్నారన్నారు. కేంద్రం కూడా కాపీ కొట్టిందన్నా రు. ఒక్కో నియోజకవర్గానికి 2 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. దళితబంధు ల బ్ధిదారులు తాము ఎదిగేందుకు అవకాశం ఉన్న యూనిట్లను ఎంపిక చేసుకోవాలని సూచించారు. కొత్తగా ఆలోచించి భిన్నంగా పనిచేసి, పట్టుదలతో ముందుకు సాగితే సమాజంలో ఎదగడం సాధ్యమవుతుందన్నారు. వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్, నర్సరీల ఏర్పాటుకు సిద్ధం కావాలని సూచించారు. అవసరమైతే ఇతర రాష్ర్టాల్లో ఉన్న పరిశ్రమలను పరిశీలించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. గాంధీ, అంబేద్కర్ కొన్ని విషయాల్లో అభిప్రా య బేధాలు ఉన్నప్పటికీ దళితుల అభివృద్ధికి పాటుపడ్డారన్నారు. త్వరలో మిగతా వర్గాలకు కూడా లబ్ధి చే కూరుతుందన్నారు.
జిల్లాలో 199 మంది లబ్ధిదారుల ను ఎంపిక చేసినట్లు తెలిపారు.ఎంపీ రాములు మాట్లాడుతూ దళితులు అభివృద్ధి చెందాలన్న అంబేద్కర్ క లను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారన్నారు. కేసీఆర్ చే తులమీదుగా ప్రారంభించుకున్న కలెక్టరేట్లో దళితబం ధు పథకం తొలి సమావేశం పెట్టడం సంతోషకరమన్నా రు. అనంతరం 13 మంది లబ్ధిదారులకు దళితబంధు మంజూరు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్భాషా, అదనపు కలెక్టర్లు ఆశిష్ సంగ్వాన్, వేణుగోపాల్, జెడ్పీ వైస్ చైర్మన్ వామన్గౌడ్, జెడ్పీటీసీ భరత్, మున్సిపల్ చైర్మన్లు గట్టు యాదవ్, కరుణశ్రీ, ఎంపీపీ మౌనిక, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.