మదనాపురం, మార్చి 3 : ఈనెల 8న వనపర్తి జిల్లా కు విచ్చేస్తున్న తెలంగాణ అభివృద్ధి ప్రదాత, ప్రజల ఆ త్మబంధువు ముఖ్యమంత్రి కేసీఆర్కు ఘనస్వాగతం ప లికి సీఎం పర్యటనను విజయవంతం చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరజన్రెడ్డి అన్నారు. మదనాపురం మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎంపీపీ పద్మావతి అధ్యక్షతన గురువారం ఏర్పాటు చేసిన ఉమ్మడి మదనాపురం, కొత్తకోట మండలాల స న్నాహక సభ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిన గొ ప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని అభివర్ణించారు. ‘మనఊరు -మనబడి, మనబస్తీ -మనబడి’ కార్యక్రమం వనపర్తి జిల్లా నుంచే ప్రారంభమవుతున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మా ట్లాడుతూ కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం సాధ్యపడేది కాదన్నారు. 70ఏండ్ల ఉమ్మడి పాలనలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మన రాష్ట్రం సీఎం కేసీఆర్ నేతృత్వంలో కేవలం ఏడేండ్ల కాలంలోనే అన్ని రంగాల్లో ప్రగతిని సాధించామన్నారు. కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ వామన్గౌడ్, ఎంపీపీలు పద్మావతి, మౌనిక, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలనారాయణ, మాజీ చైర్మన్లు వెంకట్నారాయణ, భీంరెడ్డి, వైస్ చైర్మన్ వెంకట్రాములు, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, సింగిల్విండో చైర్మన్లు వంశీధర్రెడ్డి, వాసుదేవరెడ్డి, జెడ్పీటీసీ కృష్ణయ్య, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, రైతుబంధు మండల కో-ఆర్డినేటర్లు హనుమాన్రావు, కొండారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యాదగిరి, యూత్ అధ్యక్షుడు రాజ్కుమార్, స ర్పంచుల సంఘం అధ్యక్షుడు కురుమూర్తి, శ్రీనివాసు లు, ఎంపీటీసీల సంఘం మండలాధ్యక్షుడు కురుమ య్య, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి..
సీఎ కేసీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లను త్వరితగతిన పూర్తిచేయాలని మంత్రి నిరంజన్రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటనలో భాగంగా జెడ్పీహెచ్ ప్రభుత్వ బాలుర పాఠశాల, నర్సింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభ ఏర్పాట్లను కలెక్టర్ షేక్ యాస్మిన్బాషాతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయం, మెడికల్ కళాశాల, చిట్యాల వ్యవసాయ మార్కెట్ యార్డు, డబుల్బెడ్రూం ఇండ్ల ప్రారంభం తదితర అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి సీఎం రానున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు జాప్యం లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో 6వేల మంది విద్యార్థులతో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ఉన్నందున ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. మంత్రి వెంట డీఆర్డీవో నర్సింహులు, ఆర్డీవో అమరేందర్, డీఎఫ్వో రామకృష్ణ, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.