వనపర్తి, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం ఎస్సీల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారి కుటుంబాలకు వరంలా మారనున్నది. వనపర్తి నియోజకవర్గానికి వంద మంది చొప్పున లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా చేపట్టనున్నట్లు కలెక్టర్ షేక్యాస్మిన్ బాషా తెలిపారు. దళితబంధు పథకంపై గురువారం కలెక్టర్ ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు.
నమస్తే తెలంగాణ : జిల్లాలో దళితబంధు స్టేటస్ ఏమిటి..?
కలెక్టర్ : జిల్లాలో దళితబంధు ప్రక్రియ కొనసాగుతున్నది. సాచురేషన్ మోడ్లో దీనిని అమలు చేయనున్నాం. నియోజకవర్గానికి వంద మంది చొప్పున లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్నది. ఎమ్మెల్యేలు బాధ్యులుగా ఉంటారు. పథకం అమలును కలెక్టర్గా పర్యవేక్షిస్తుంటాను. ఇప్పటికే అధికారులతో సమీక్షలు నిర్వహించి సూచనలు చేశాం. ప్రభుత్వం పూర్తిస్థాయిలో గ్రాంటుగా అందిస్తున్నది. రీ పేమెంట్ ఉండదు. బ్యాంకు లింకేజీ లేదు.
మీ పరిధిలో ఉన్న ఇతర జిల్లాల నియోజకవర్గాలను ఎలా సమన్వయం చేసుకుంటారు..?
జిల్లాలో వనపర్తి నియోజకవర్గం మాత్రమే పూర్తిగా ఉన్నది. దేవరకద్ర, మక్తల్, కొల్లాపూర్ నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని మం డలాలు జిల్లా పరిధిలో ఉన్నాయి. అయితే, జిల్లాలో ఉన్న మం డలాల్లో లబ్ధిదారుల ఎంపికను సమీక్షిస్తాను.
లబ్ధిదారుల ఎంపిక ఎలా ఉండనున్నది..?
వచ్చే నెల 7వ తేదీలోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి పథకాలు గ్రౌండింగ్ కావాలని ఆదేశాలున్నాయి. లబ్ధిదారుల ఖా తాల్లో ప్రభుత్వం నేరుగా రూ.10 లక్షలు డిపాజిట్ చేస్తుంది. ఇందులో మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. అర్హులకు ఎటువంటి విద్యార్హతలు లేవు. అయితే, ఈ పథకం కింద అనేక వెసులుబాట్లు ఉన్నాయి. లబ్ధిదారుడు రూ.10 లక్షలతో రెండు, మూడు వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు. రూ.2 లక్షలతో కి రాణం, మిగతా డబ్బులతో పాడి పరిశ్రమ పె ట్టుకోవచ్చు. ఒక్కటే వ్యా పారం చేయాలన్న నిబంధనలు లేవు. కుటుంబం యూనిట్ గా డబ్బులు అందజేస్తాం.
మధ్యవర్తుల ప్రమేయాన్ని ఎలా అరికడుతారు..?
లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుంది. డబ్బులు ఇప్పిస్తామని చెప్పి మోసం చేయాలని చూసే వారి గురించి మా దృష్టికి తీసుకురావాలి. దళారుల ప్రమేయం ఉండదు. ప్రజలు మోసపోవద్దు. ప్రతి మండలానికి జిల్లాస్థాయి ఇన్చార్జిని నియమించి పర్యవేక్షిస్తాం.