ఆత్మకూరు, మే 25 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రోజురోజుకూ వస్తున్న సమస్యల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని.. ప్రతి గింజనూ కొంటామని అదనపు కలెక్టర్ వేణుగోపాల్రావు పేర్కొన్నారు. మంగళవారం ఆత్మకూరు మార్కెట్యార్డ్లో ధాన్యం కొనుగోలు కేంద్రం, గోదాంలను సందర్శించిన ఆయన రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. ఈ ఏడాది ధాన్యం అధికంగా పండిందని.. అనుకున్న దానికంటే ఎక్కువ పంట రాబడి రావడంతో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. రైతులు సహకరిస్తే అన్ని సమస్యలు తీరి అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. ప్రతీ గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ ధాన్యం నిల్వ చేసేందుకు సమస్యలు ఏర్పడ్డాయని అన్నారు.
ధాన్యం నిల్వల కోసం గ్రామాల్లోని పౌల్ట్రీఫామ్లు, పురాతన భవనాలు, ప్రభుత్వానికి సంబంధించిన భవనాలను వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈమేరకు భవనాల వివరాలు సేకరించేందుకు ఇప్పటికే గ్రా మ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. మార్కెట్యార్డ్లో కూలీల కొరత, అన్లోడింగ్, లోడింగ్ హమాలీల కొరతతో ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. ఈ స మస్యను అధిగమించేందుకు పరిష్కార మార్గాలను అన్వేశిస్తునట్లు చెప్పుకొచ్చారు. అదేవిధంగా మార్కెట్ మొత్తాన్ని పరిశీలించి ధాన్యం సేకరణను పర్యవేక్షించారు. కార్యక్రమం లో మార్కెట్యార్డ్ చైర్మన్ లీలావతమ్మ, వైస్చైర్మన్ నాగభూషణంగౌడ్, నాయబ్ తాసిల్దార్ నందకిశోర్ పాల్గొన్నారు.
పెద్దమందడిలో..
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న వరి ధాన్యం అకాల వర్షాలకు తడిసి దెబ్బతింటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ధాన్యం నిల్వ చేసేందుకు అనువైన స్థలాన్ని పరిశీలించాలని ఆదేశాలు ఇవ్వగా మంగళారం మండలంలోని చిన్నమందడి గ్రామానికి చెందిన చౌదర్రెడ్డి తోటలో ఉన్న షెడ్లను అదనపు కలెక్టర్ వేణుగోపాల్ పరిశీలించారు. వర్షాలు ప్రారంభమవ్వడంతో రైతులు తీసుకువచ్చిన ధాన్యం అకాల వర్షాలకు తడిస్తే నష్టపోయే అవకాశం ఉన్నందున రైస్మిల్లులలో స్థలం కొరతతో యాజమానులు ముందుకురాకపోవడంతో ప్రభుత్వం ధాన్యాన్ని నిల్వ ఉంచేలా చర్యలు తీసుకుందని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థలాన్ని పరిశీలించి ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. పరిశీలించిన వారిలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, తాసిల్దార్ సునీత, మాజీ జెడ్పీటీసీ వెంకటస్వామి, కుమార్యాదవ్ ఉన్నారు.