వనపర్తిలోని మదనాపురం లోలెవెల్ వంతెన వద్ద ముగ్గురు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. శనివారం నాడు భారీ వర్షాల కారణంగా ఏర్పడిన ఉధృత ప్రవాహంలో ముగ్గురూ కొట్టుకుపోయారు. ఉధృత ప్రవాహంలో లో లెవెల్ వంతెన మీదుగా బైక్పై వస్తుండగా.. వారి వాహనం అదుపు తప్పింది. దీంతో వంతెన మీద నుంచి నీళ్లలో పడిపోయారు. తల్లీకూతుళ్లు సంతోషమ్మ, పరిమళ మృతదేహాలు లభ్యమవగా.. సాయికుమార్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.