నారాయణపేట టౌన్, ఏప్రిల్ 8 : ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించిన ఘటన నారాయణ పేట జిల్లా ప్రభుత్వ దవాఖానలో చోటు చేసుకున్నది. దవాఖాన సూపరింటెండెంట్ రంజిత్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఊట్కూర్ మండలం చిన్నపొర్ల గ్రామానికి చెందిన సుజాత రెండ్రోజుల కిందట ప్రసవం కోసం నారాయణపేట జిల్లా దవాఖానలో చేరింది.
శుక్రవారం గర్భిణీని డాక్టర్ అక్షితారెడ్డి, అనస్తీషియన్ చంద్రమోహన్, నర్సులు విక్టోరియా, విజయలక్ష్మి పరిశీలించారు. ఆపరేషన్ అవసరమని సిజేరియన్ చేయగా.. ఇద్దరు మగ, ఒక ఆడ శిశువు జన్మించింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. దవాఖానలో సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలే జరుగుతాయని, అత్యవసరమైతే తప్పా సిజేరియన్ ఆపరేషన్లు చేయమని సూపరింటెండెంట్ రంజిత్కుమార్ తెలిపారు.