వస్ర్తాలు సమర్పించిన కొత్తకోటకు చెందిన నేతన్న
ప్రతి ఏడాది లక్ష్మీనరసింహ స్వామికి అందిస్తున్నట్లు వెల్లడి
కొత్తకోట, ఫిబ్రవరి 27 : తెలంగాణలోనే ప్రసిద్ధ దేవాలయం యాదాద్రిలో జరిగే లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు నేత కార్మికుడు పట్టువస్ర్తాలు సమర్పించాడు. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణానికి చెందిన నేత కార్మికుడు మహంకాళీ రాజేశ్ దంపతులు ఆదివారం యాదాద్రి ఆలయ కమిటీ చైర్మన్ నర్సింహామూర్తి, ఈవో గీతారెడ్డికు పట్టువస్ర్తాలు అందజేశారు. స్వామి వారికి అందజేసేందుకు ప్రత్యేకంగా నేత కార్మికులతో పట్టువస్ర్తాలను ఆయన నేయించారు. ప్రతి ఏడాది యాదాద్రి ఉత్సవాల్లో పట్టువస్ర్తాలు సమర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. అగ్గిపెట్టెలో పట్టేంత సైజు చీరలు నేయడంలో రాజేశ్ తండ్రి పేరొందాడు.