వీపనగండ్ల: విద్యాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కల్వరాల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సొంత నగదు రూ.2.7 లక్షలతో డిజిటల్ బోర్డును అందజేశారు.. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని కల్వరాల ఉన్నత పాఠశాలతో పాటు మరిన్ని పాఠశాలలకు మంత్ర లెర్నిం గ్ అకాడమీ తయారు చేసిన 2డి, 3డి యామినేషన్ కంటెంట్ని కూడా అందుబాటులోకి తెస్తామన్నారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఉన్నత చదువుల కోసం మరింత సాయం అందించడానికి కృషి చేస్తామన్నారు. దీనిని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల అభున్నతి కోసం కృషి చేయాలని కోరారు. అనంతరం గ్రామంలోని శ్రీకృష్ణ విగ్రహం ప్రతిష్టాపన కోసం ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
కార్యక్రమంలో డీఈవో రవీందర్, ఎంఈవో లక్ష్మణ్నాయక్, సర్పంచు రఘునాథన్రెడ్డి, ఉపసర్పంచు మోహన్, రైతు బంధు మండలాధ్యక్షుడు ఎత్తం కృష్ణయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సత్యనారాయణగౌడ్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు ఎండి సర్దార్, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.