వనపర్తి : సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని కొత్తకోట మండలంలో ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ లేకుంటే కల్యాణ లక్ష్మి పథకం లేదన్నారు. వరంగల్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఊరూరు తిరుగుతూ ఒక్కసారి అవకాశం అధికారం ఇవ్వాలని అడుగుతున్నారు.
గతంలో 10సార్లు అవకాశం ఇస్తే చేయలేదు. ఇప్పుడు చేస్తారా అని ప్రశ్నించారు. బీజేపీ కూడా అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు. బండి సంజయ్ ప్లీజ్, ప్లీజ్ అంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో రైతుబంధు ఉందా? ఉచిత విద్యుత్ ఉందా? మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ అధికారంలో ఉంటేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.