వనపర్తి : జిల్లా పోలీసులు మత్తు పదార్థాలపై ఉక్కు పాదం మోపుతున్నారు. తాజాగా
కొత్తకోట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని ముగ్గురు యువకుల నుంచి 58 గంజాయి ప్యాకెట్లను టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సీఐ ఓంకార్ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కొత్తకోట పట్టణ సమీపంలోని సాయిబాబా గుడి వెనకాల ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో వారిని విచారించగా వారి వద్ద 58 ప్యాకెట్ల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు. అందులో గద్వాల్ ప్రాంతానికి చెందిన చెందిన మహ్మద్ రఫీ, మదనాపురం గ్రామానికి చెందిన షేక్ నూర్ పాషా, కొత్తకోట పట్టణానికి చెందిన బజార్ సతీష్ వద్దను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
సుమారుగా వీటి విలువ 29 వేల రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు. ఒక్కొక్క ప్యాకెట్లు 350 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు సీఐ వివరించారు. గంజాయి ప్యాకెట్లతో పాటు మూడు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.