వనపర్తి , నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : వనపర్తి జిల్లా కేంద్రం గులాబీమయమైంది. మంగళవారం జిల్లాకేంద్రంలోని రాజీవ్చౌరస్తాలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి రోడ్ షో నిర్వహించగా జై కేసీఆర్, జై తెలంగాణ, నినాదాలతో హోరెత్తింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉన్నత విద్యావంతులకు నిలయమైన వనపర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి ఇంటర్ వరకు విద్యాభ్యాసం, 420కేసు పెండింగ్లో ఉందని తన అఫిడవిట్లో సూచించిన అంశాలను ఉన్నత విద్యావంతులు ఆలోచించాలని మంత్రి కోరారు.
ఎన్నికల్లో డబ్బులు పంచే వారికి కాకుండా అభివృద్ధి చేసిన వారికే ఓట్లు వేసి అండగా నిలబడాలని మాజీఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి పిలుపునిచ్చారు. రోడ్ షోలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, నాయకులు సయ్యద్ ఇబ్రహీం, పురుషోత్తంరెడ్డి, కురుమూర్తి యాదవ్, ప్రజలు భారీగా తరలొచ్చారు.