వనపర్తి టౌన్: జార్ఖండ్, ఉత్తర్ప్రదేశ్ రాష్ర్టాలలో జరుగనున్న జూనియర్, సీనియర్ జాతీయ హాకీ పోటీలలో రానించి జిల్లా కు, రాష్ర్టానికి మంచి పేరు తీసుకురావాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి క్రీడాకారులకు సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తన స్వగృహాంలో జాతీయ స్థాయికి ఎంపికైన హాకీ క్రీడాకారులను ఆయన అభినందించా రు.
ఈ నెల 19 నుంచి 30 వరకు జార్ఖండ్ రాష్ట్రంలో జరుగనున్న జాతీయ స్థాయి హాకీ పోటీలకు జూనియర్ హాకీ విభాగంలో తెలంగాణ జట్టుకు చెందిన ఈశ్వరమ్మ, శిరీషలు, సీనియర్ విభాగంలో అఖిల, గంగోత్రిలు ఉత్తరప్రదేశ్లో జరిగే జాతీయ స్థాయికి ఎంపిక కావడం అభినందనీయమని అన్నారు. దేశవాళీ పోటీలలో ప్రతిభ కనబర్చి రాష్ర్టానికి , జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
ఈ నెల 18 వరకు హైదరాబాద్లోని ఎన్టీర్ శిక్షణా శిబిరంలో మెళుకువలు నేర్చుకోవాలని అన్నారు. కార్యక్రమంలో హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పగడాల శ్రీనివాస్రెడ్డి, అసోసియేషన్ కార్యదర్శి బోలమోని కుమార్, జిల్లా కోశాధికారి మన్నెం యాదవ్, సభ్యులు కరుణాకర్, సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.