జడ్చర్లటౌన్, అక్టోబర్ 28 : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించి.. జడ్చర్ల ఎమ్మెల్యేగా మరోసారి లక్ష్మారెడ్డిని గెలిపించండంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో శనివారం కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు ఇం టింటికెళ్లి ఓటర్లను కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృ ద్ధి, సంక్షేమ పథకాలను గురించి వివరిస్తూ జడ్చర్ల బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు. మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరిన్ని సంక్షేమ పథకాలను అందుతాయని ప్రజలకు వివరించారు. అలాగే బీఆర్ఎస్ శ్రేణులు గడపగడపకు వెళ్లి బీఆర్ఎస్ మ్యానిఫెస్టో కరపత్రాలను ఓటర్లకు అందించి సంక్షేమ పథకాలను గురిం చి అవగాహన కల్పించారు. జడ్చర్ల అభివృద్ధికి పాటుపడుతున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని మరొసారి భారీ మెజార్టీతో గెలిపించి జడ్చర్ల అభివృద్ధికి సహకరించాలని బీఆర్ఎస్ శ్రేణులు ఓటర్లను కలిసి ప్రచారం చేస్తున్నారు. పలువార్డుల్లో ఓటర్లు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీకే తమ మద్దతు ఉంటుందని భరోసానిస్తున్నారు.
రాజాపూర్లో..
రాజాపూర్, అక్టోబర్ 28 : పేదల కష్టాలను గుర్తించి అం డగా ఉండి అన్నివిధాల అదుకునేది కేవలం కారు గుర్తు గులా బీ పార్టేనని డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, జెడ్పీటీసీ మోహన్నాయక్ అన్నారు. శనివారం మండలంలోని గుండ్లపోట్లపల్లి, బీబీనగర్, ఖానాపూర్ గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరూ కారుగుర్తకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ మహిపాల్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, యూత్వింగ్ అధ్యక్షుడు వెంకటేశ్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు బచ్చిరెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింహులు, సర్పంచులు రాఘవేందర్రెడ్డి, గోవింద్నాయక్, రమేశ్నాయక్ పాల్గొన్నారు.
మిడ్జిల్లో..
మిడ్జిల్, అక్టోబర్ 28 : ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాండు, ఎంపీపీ సుదర్శన్, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు జంగిరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని వేముల, వాడ్యాల్, దోనూర్, కొత్తపల్లి, చిల్వేర్ తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు జోరుగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు తెలియజేస్తూ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి ఓటు వేయాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో ఇంటింటికీ వివరించారు. పని చేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, నాయకులు సుధాబాల్రెడ్డి, శ్యామ్సుందర్రెడ్డి, బాలు, శ్రీనివాసులుగుప్తా, జైపాల్రెడ్డి, సత్యంగుప్త, రవికుమార్, శ్రీనివాసులు, ఎల్లయ్యయాదవ్, శివప్రసాద్, వెంకట్సాగర్, కాడయ్య, సుకుమార్, భిక్షపతి, బుచ్చయ్య, బంగారు, చంద్రయ్య, భీమ్రాజు, వెంకటయ్య, నవీనాచారి, గోపాల్, జగన్గౌడ్, ఉదయ్కుమార్, అయ్యప్ప, నర్సింహా, రాము, నాగరాజు, కుమార్, శివ, రాజు, ఆంజనేయులు గ్రామస్తులు ఉన్నారు.
ఊర్కొండలో..
ఊర్కొండ, అక్టోబర్ 28 : ప్రచారంలో బీఆర్ఎస్కు ప్రజ ల నుంచి మంచి స్పందన వస్తున్నదని ఎంపీపీ రాధజంగ య్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వీరారెడ్డి అన్నారు. మండలంలోని బాల్యలోకతండాలో శనివారం నిర్వహించిన ప్రచారంలో వారు మాట్లాడారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ముచ్చటగా మూడోసారి గెలుపే లక్ష్యంగా ప్రచారం సాగుతున్నదన్నారు. తండా సర్పంచ్, ఎంపీటీసీ గోపాల్గుప్తా ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారం నిర్వహించారు. అనంతరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించి కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు.