మహబూబ్నగర్, జూలై 30 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలతో కురుమ, యాదవుల జీవితాల్లో పెనుమార్పులు చోటుచేసుకున్నాయని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నా రు. మహబూబ్నగర్ రూరల్ మండలంలోని జైనల్లీపూర్, కోడూర్, మాచన్పల్లి గ్రామాలకు చెందిన 18 మంది కురుమ, యాదవులకు రెండో విడుత కింద ఆదివారం జిల్లా కేంద్రంలో గొర్రెలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పథకాలు దేశవ్యాప్తం కావాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లారన్నారు.
కాలనీని అద్భుతంగా తీర్చిదిద్దుతాం..
మహబూబ్నగర్ అర్బన్, జూలై 30 : మహబూబ్నగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, కురిహిణిశెట్టి కాలనీ కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని వార్డు 28 పరిధిలోని జాండ్ర కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన మంత్రికి స్థానికులు క్రేన్ సహాయంతో భారీ పూలమాలవేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం కాలనీలోని తోట మైసమ్మ ఆలయం లో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో మండప నిర్మాణానికి రూ.5 లక్షలతో చేపట్టిన పనులకు భుమి పూజ చేశా రు. ఈ సందర్భం గా మా ట్లాడారు. పద్మావతి కాలనీతో నిర్మిస్తున్న జాం డ్ర కమ్యూనిటీ హాల్కు రూ.కోటీ మంజూరు చేశామన్నారు. అనంత రం మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు రామలిం గం, బీఆర్ఎస్ నాయకుడు సాయి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఆంజనేయులు, వెంకటేశ్, అరుణ్, స్వామి, శ్రీనివాస్తో కలిసి 150 మందికి పైగా మంత్రి సమక్షం లో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి మంత్రి ఆహ్వానించారు.
సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలి
మహబూబ్నగర్టౌన్, జూలై 30: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అ న్నారు. ఆదివారం 22వ వార్డు పరిధిలోని బూత్ ఇన్చార్జీలు, నాయకులతో క్యాంప్ కార్యాలయంలో, 47వ వార్డులో పరిధి సమావేశం జిల్లా కేంద్రంలోని కోర్టు బ్యాక్సైడ్ ఉన్న అల్తాఫ్ హుస్సేన్ ఇంటి సమీపంలో ఆత్మీయ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. అలాగే
జిల్లా కేంద్రంలోని 47వవార్డులో కోర్టు పక్కన నిర్మించనున్న పార్కు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్ను సుందరపట్టణం గా తీర్చిదిద్దుతామని మంత్రి పేర్కొన్నారు.
అక్కమహాదేవి గుహలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం
పాలమూరు, జూలై 30 : అక్కమహాదేవి గుహలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. స్థానిక సుదర్శన్ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన వీరశైవ లింగాయత్ వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక, మహారాష్ట్ర భక్తులతోపాటు లింగాయత్లకు ఎంతో పవిత్రమైన అక్కమహాదేవి ఆలయం గుహల వద్ద పర్యాటకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇప్పటికే 1.60కోట్ల నిధులతో అక్కమహాదేవి గుహ వద్ద మెట్లు, జెట్టి ఏర్పాటు చేస్తామన్నారు. పర్యాటలకుల కోసం బోటు సౌకర్యం కూడా కల్పిస్త్తున్నామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే రాష్ట్రం లో బసవేశ్వరుడి జయంతి అధికారికంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి బసవ భవన్ 3వేల గజాల్లో బ్రహ్మాండంగా నిర్మించామని తెలిపారు. ట్యాంక్బండ్ పై బసవేశ్వరుని విగ్రహం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ కోకాపేట్లో రూ.200కోట్ల విలువైన భూమి,నిధులు ఇచ్చి బసవ భవన్ నిర్మించామని, ఆత్మగౌరవ భవనాలకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్గా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు రామలింగం, కౌన్సిలర్లు వేదవ్రత్,గోవిందు, మల్లేశ్, సత్తి, నాగన్న, పవన్ జేపీఎర్సీఈ కళాశాల చైర్మన్ రవికుమార్, నాయకులు లక్ష్మారెడ్డి, ప్రశాంత్, రామకృష్ణ, సలీంనవాబ్, వీరశైవ లింగాయత్ ప్రముఖులు వజ్రలింగం, శంకర్ లింగం, పోకల శివుడు, కొండా వీరన్న, నాగభూషణం, మహేశ్వరస్వామి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.