దేవరకద్ర, ఏప్రిల్ 10 : ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన దేవరకద్ర పట్టణం లో బుధవారం చోటు చే సుకున్నది. ఎస్సై నాగన్న కథనం మేరకు.. మహబూబ్నగర్ రూరల్ మండలం కోడూర్ గ్రామానికి చెందిన అంజమ్మ, వెంకటయ్యల రెండో కుమారుడు శివకుమార్(22), యశోద, ఊషన్నల రెండో కుమారుడు గణేశ్ (22) ఇద్దరు స్నేహితులు కావడంతో ఉగాది పండుగకు గ్రామానికి వచ్చారు. గణేశ్ హైదరాబాద్లో డిప్లొమా చదువుతుండగా.. శివకుమార్ కొత్తకోటలోని ఓ ప్రైవేట్ కంపెనీలో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. బుధవారం కరి పండుగ ఉండడం తో సరదాగా గడిపేందుకు దేవరకద్రలోని కన్న య్య బావిలో ఈత కోసం వెళ్లారు.
శివకుమార్ బావి లో దిగి ఈత పడుతుండగా గణేశ్కు ఈత రాకపోవడం తో తర్వాత బావిలోకి దిగా డు. గణేశ్ మునిగిపోతుండడంతో గ్రహించిన శివకుమా ర్ కాపాడేందుకు ప్రయత్నిం చగా ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందారు. గమనించి న స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇ వ్వడంతోపాటు యువకుల మృతదేహాలను బా వి నుంచి బయటకు తీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించినట్లు ఎస్సై వెల్లడించారు. దీంతో కోడూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.