కొత్తకోట, జనవరి 26 : షి రిడి సాయి దర్శనానికి వెళ్తున్న రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కొత్తకోట పట్టణానికి చెందిన కృష్ణ అతడి భార్య వసుధ (30), కూతురు లావ్య, కుమారుడు శ్రీమన్(3)తో పా టు కర్నూల్ జిల్లా డోన్కు చెం దిన వెంకట్రాములు, రోజారమణి, వారి కుమారుడు ప్రవీణ్ (26)లు కలిసి షిరిడికి డోన్ నుంచి గురువారం ఉదయం బయలుదేరారు. వీరితోపాటు కృష్ణ కుటుంబ స భ్యులు మార్గమధ్యంలో హైదరాబాద్లో వారు వెళ్తున్న కారులో కలిసి వెళ్లారు.
శుక్రవారం తెల్లవారు జామున ముందు వెళ్తున్న లారీని షిరిడి సమీపంలోని వైకాస్పూర్ వద్ద వారి కారు ఢీకొట్టింది. దీంతో వసు ధ, ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందగా, శ్రీమన్ దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెం దారు. కృష్ణ, కుమార్తె లా వణ్యతోపాటు వెంకట్రాములు, రోజారమణి తీ వ్రంగా గాయపడి ఓ ప్రై వేట్ దవాఖానలో చికి త్స పొందుతున్నారు. కొత్తకోటకు చెందిన తల్లి, కుమారుడు షిరిడి వెళ్తూ మృతి చెందడంతో పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.