పెబ్బేరు, డిసెంబర్ 28 : ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని బతికించే కనిపించే దేవుళ్లు వైద్యులు అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం మండలకేంద్రంలో రూ.50 లక్షల నిధులతో నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశా రు. అనంతరం పీహెచ్సీలో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 42 మంది క్షయవ్యాధిగ్రస్తులకు తన సొంత డబ్బుతో 5 కిలోల బియ్యం, కిలో నూనె, రెండు కిలోల కందిపప్పు, 30 గుడ్లతో కూడిన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ సమాజంలో ఎవరికీ లేని గుర్తింపు డాక్టర్లకు ఉన్నదన్నారు. రెండేండ్లుగా కరోనా మహమ్మారిని అరికట్టేందుకు వారి ప్రాణాలను సైతం లెక్క చేకుండా మృత్యువుకు ఎదురెళ్లి ఎందరో రోగుల ప్రాణాలను కాపాడారని అభినందించారు.
శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగితేనే క్షయ వ్యాధి దూరమవుతుందని మంత్రి తెలిపా రు. మాంసం తింటేనే బలం వస్తుందనే అపోహా లు మానుకొని కంది పప్పు, గుడ్డు, ఆకు కూరల్లో నూ మాంసకృత్తులు ఉంటాయని వివరించారు. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే బలవర్థక ఆహారం తీసుకోవాలని సూచించారు. క్షయ వ్యా ధి సోకిందని భయపడిల్సిన అవసరం లేదని, వై ద్యులు సూచించిన సూచనలను పాటిస్తే ఆరు నెల ల్లో వ్యాధి నయమవుతుందని చెప్పారు. జిల్లాలో ఉన్న 385 మంది క్షయవ్యాధిగ్రస్తులకు తన సొం త డబ్బుతో ప్రతి నెలా నిత్యావసర సరుకులను అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ము న్సిపల్ చైర్ పర్సన్ కరుణశ్రీ, వైస్ చైర్మన్ కర్రెస్వా మి, ఎంపీపీ శైలజ, జెడ్పీటీసీ పద్మ, బీఆర్ఎస్ ప ట్టణ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు దిలీప్ కుమార్రెడ్డి, సాయినాథ్, పట్టణ మహిళా అధ్యక్షురాలు భార తి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యం..
శ్రీరంగాపూర్, డిసెంబర్ 28 : గ్రామాల్లో మౌ లిక వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. మండలంలోని జానంపే ట, వెంకటాపూర్, కంబాళాపూర్ గ్రామాల్లో మం గళవారం ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతో వలసలు తగ్గాయన్నారు. దేశంలో ఎ క్కడా లేని విధంగా గ్రామాల్లో విద్య, వైద్యం, సా గు, తాగునీరు, రహదారుల నిర్మాణం, పల్లెప్రకృతివనాలు, వైకుంఠధామాలు, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
జానంపేట, వెంకటాపూర్ గ్రామాల్లో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎస్సీ కార్పొరేషన్, గ్రామ పంచాయ తీ స్పెషల్ డెవలప్మెంట్ నిధుల నుంచి రూ. 12.50 లక్షలు, కంబాళాపూర్లో ఎన్ఆర్ఈజీస్ నిధుల నుంచి రూ.20 లక్షలను మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకట్స్వామి, ఎంపీపీ గాయిత్రి, సింగిల్విండో చైర్మన్ జగన్నాథం నాయుడు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు గౌడ్నాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బుచ్చారెడ్డి, నాయకులు మ హేశ్గౌడ్, పృథ్వీరాజు తదితరులు పాల్గొన్నారు.