మహబూబ్నగర్ టౌన్, జూలై 17 : నష్టాల బాట నుం చి ఆర్టీసీ లాభాల బాట పట్టింది. ఇందుకోసం వినూత్న కార్యక్రమాలతో ప్రయాణికులను ఆకట్టుకుంటున్నది. సంస్థ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ సంస్థను ప్రజలకు మరింత చేరువ చేయడానికి కృషి చేస్తున్నారు. హైదరాబాద్లోని సిటీ బస్సుల్లో అమలు చేస్తున్న టీ-624, టీ-6, ఎఫ్-24 టికెట్ల తరహాలో ఇటీవల జిల్లాల పరిధిలోని పల్లెవెలుగు బస్సుల్లో టీ-9 టికెట్ అందుబాటులోకి తెచ్చారు. అయితే ప్రయాణికుల ఆర్థిక భారం మ రింత తగ్గించేందుకు మరో కీలక నిర్ణ యం తీసుకున్నారు. కొత్తగా పల్లెవెలు గు టౌన్ బస్పాస్కు శ్రీకారం చుట్టారు. సోమవారం ఇందుకు సంబంధించిన పోస్టర్లను హైదరాబాద్లో ఎండీ సజ్జనార్ ఆవిష్కరించారు.
నేటి నుంచి అమలు
పల్లె వెలుగు టౌన్ బస్పాస్ ఇప్పటికే హైదరాబాద్, వరంగల్లో జనరల్ బస్పాస్ అందుబాటులో ఆర్టీసీ సంస్థ ఉం చింది. నేటి నుంచి మొదటగా మహబూబ్నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రంలో తిరిగే పల్లెవెలుగు బస్సు ల్లో ఈ పాస్ను అమలు చేయాలని నిర్ణయించింది. మహబూబ్నగర్లో 10 కిలోమీటర్ల పరిధి దూరానికి నెలకు రూ.800 పల్లెవెలుగు టౌన్ బస్పాస్ ధరను ఖరారు చే సింది. ప్రయాణికుల టికెట్ ఖర్చు తగ్గించండంతోపాటు ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచుకునేందుకు ఈపాస్ సాధారణ ప్రయాణికులకు కూడా అందుబాటులోకి తెచ్చింది.
సద్వినియోగం చేసుకోవాలి
ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు ఇప్పటికే ఆర్టీసీ టీ-9 టికెట్ను అందుబాటులో కి తెచ్చింది. జిల్లా కేంద్రాల్లోనూ అమలు చేయాలని ప్రయాణికుల నుంచి అభ్యర్థనల మేరకు కొత్తగా పల్లెవెలుగు టౌన్ బస్లోనూ అధికారులు అమలుకు శ్రీకారం చుట్టారు. మంగళవారం నుంచి పాస్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి.
– శ్రీదేవి, ఆర్టీసీ ఆర్ఎం, మహబూబ్నగర్