సకాలంలో వైద్య సేవలు అందక ఎందరో ప్రాణాలు కోల్పోతుంటారు. నిత్యం హైవేలపై ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ప్రమాదాలు జరిగిన వెంటనే చికిత్సలు అందించేలా జాతీయ రహదారిపై ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మూసాపేట మండలం జానంపేట వద్ద ఐదెకరాల స్థలం కేటాయించారు. 50 బెడ్లతో క్రిటికల్ కేర్ యూనిట్ అందు బాటులోకి రానున్నది. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కృషితో రూ.కోట్ల స్థలం వైద్య శాఖకు బదలాయింపు జరిగింది. ఇకపై రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే వైద్యం మరింత చేరువ కానున్నది.
మహబూబ్నగర్, జనవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రుల్లో చాలా మంది సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని 44వ జాతీయ రహదారిపై ట్రామా కేర్ సెంటర్, క్రిటికిల్ కేర్ యూనిట్ను నెలకొల్పాలని ప్రభుత్వం భావించింది. అయితే, ఇందుకు అవసరమైన అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో దవాఖానను తమ నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఇటీవల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావుకు వినతి అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించడంతో ముసాపేట మండలం జానంపేట వద్ద జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఐదెకరాలను వైద్య, ఆరోగ్య శాఖకు అప్పగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
యమడేంజర్గా మారిన ఎన్హెచ్..
హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి యమడేంజర్గా మారింది. నిత్యం ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. క్షతగాత్రులను అంబులెన్స్లో సమీప దవాఖానలకు తరలించి చికిత్స అందించేలోపే చాలామంది మృత్యువాత పడుతున్నారు. హైదరాబాద్ నుంచి కర్నూల్ వరకు అన్ని ప్రభుత్వ దవాఖానలు జాతీయ రహదారికి దూరంగా ఉన్నాయి. అలంపూర్, గద్వాల, వనపర్తి, మహబూబ్నగర్, జడ్చర్ల దవాఖానల్లో పరిస్థితి విషమించిన వారికి ప్రథమ చికిత్స చేసి హైదరాబాద్కు రెఫర్ చేస్తున్నారు. జాతీయ రహదారుల నిబంధనల ప్రకారం ప్రతి 60 కిలోమీటర్లకు ఒక క్రిటికల్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి. కానీ ఈ నిబంధనలను పట్టించుకోవడం లేదు. భూత్పూర్ నుంచి కర్నూల్ వరకు జాతీయ రహదారి డిజైన్ లోపభూయీష్టంగా ఉండడంతో పాలెం వద్ద ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురై 44 మంది సజీవ దహనం అయ్యారు.
ఆధునిక వసతులతో ట్రామా కేర్ సెంటర్..
రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్-కర్నూల్ జాతీయ రహదారిపై అధునాతన సౌకర్యాలతో అన్ని చికిత్సలు అందించేందుకు ట్రామాకేర్ సెంటర్ నెలకొల్పాలని సంకల్పించింది. ఇటీవల మహబూబ్నగర్కు వచ్చిన మంత్రి హరీశ్రావు.. ఎమ్మెల్యేలకు ఈ విషయాన్ని వివరించారు. కాగా, జాతీయ రహదారిపై తన నియోజకవర్గంలో 100 పడకలతో దవాఖానను నిర్మించాలని దేవరకద్ర ఎమ్యెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీంతో మంత్రి హరీశ్రావు వెంటనే స్పందించి అందుకు సంబంధించిన స్థలం, ఇతరత్రా ప్రతిపాదనలు వైద్య, ఆరోగ్య శాఖకు పంపించాలని కలెక్టర్ను ఆదేశించారు. ప్రస్తుతం 50 బెడ్లతో ఏర్పాటు చేసి.. క్రమంగా వంద పడకలకు విస్తరిస్తామని మంత్రి తెలిపారు.
24 గంటలూ వైద్య సేవలందేలా..
హైదరాబాద్ నుంచి బెంగళూరు జాతీయరహదారిపై చాలా ప్రమాదాలు అడ్డాకుల, కొత్తకోట, పెబ్బేరు, జడ్చర్ల మధ్య జరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగితే నిమిషాల్లోపే ట్రామాకేర్ సెంటర్కు తరలించేలా అంబులెన్స్ల్లో చికిత్సతోపాటు మేజర్ సర్జరీలు చేసేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించనున్నారు. క్రిటికల్ కేర్ సెంటర్లో ప్రత్యేకంగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 24 గంటలు ఆర్థోపెడిక్, జనరల్ సర్జన్లతోపాటు డాక్టర్లు అందుబాటులో ఉండనున్నారు. దీంతో ట్రామాకేర్ సెంటర్లో వైద్యం సాయం అందించి ప్రాణనష్టం తక్కువగా ఉండేలా చూడడమే దీని ముఖ్య ఉద్దేశం అని వైద్యాధికారులు అంటున్నారు.
ఐదెకరాలను ప్రతిపాదించాం..
నియోజకవర్గంలో ఎక్కువ శాతం జాతీ య రహదారిని ఆనుకుని ఉంటుంది. అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి. వేలాది వా హనాలు నిత్యం తిరుగుతుంటాయి. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుంది. జాతీయ రహదారిపై ప్రజలకు అందుబాటులో వైద్య సాయం అందించేలా దవాఖాన నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం ప ట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వమే జాతీయ ర హదారిపై క్రిటికల్ కేర్ సెంటర్ ఏర్పాటు చే యాలని ప్రతిపాదించగా.. మంత్రి హరీశ్రా వు చొరవతో జానంపే ట వద్ద దవాఖానకు అవసరమైన స్థలాన్ని చూయించాం. త్వరలో నిర్మాణాన్ని పూర్తిచేస్తాం.
– ఆలవెంకటేశ్వర్రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే