ఉప్పునుంతల, ఏప్రిల్ 11 : మండలంలోని కం సానిపల్లిలో గురువారం ఉపాధి హామీ పనుల కోసం కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 18మందికి గాయాలు కాగా, అందు లో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షు ల కథనం మేరకు.. కంసానిపల్లికి చెందిన 18 మంది ఉపాధి కూలీలు చీకటివాగు వద్ద పనులు ముగించుకొని ట్రాక్టర్పై ఇంటికి వస్తుండగా కట్టపైన అదుపుత ప్పి బోల్తా పడింది. అందులో చంద్రయ్య, శంకర య్య, కృష్ణవేణి, లక్ష్మమ్మకు కాళ్లు, చేతులు విరిగాయి. మిగతా 14 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగా త్రులను అంబులెన్స్లో అచ్చంపేట దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ గాయపడిన వారిని పరామర్శించి స్వయంగా వైద్య చికిత్సలు అందించారు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా పరామర్శించారు. ఈ ఘటనపై ఉ పాధి కూలీ పద్మ చేసిన ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసినట్లు ఎస్సై లెనిన్ తెలిపారు.