పాతరోజులు మాకొద్దు.. 24గంటల కరెంటే ముద్దు కాంగ్రెస్ పాలనలో రాత్రి మూడు గంటలు, పగలు మూడుగంటల కరెంట్ ఇస్తే మాకున్న పొలంలో పంటకు నీరందక ఎండిపోయినవి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రైతులకు 24గంటల కరెంట్ ఇస్తుండడంతో రైతులం పగలు పంటలకు నీరు పారించి వ్యవసాయం చేస్తున్నం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు కరెంట్ కష్టాలు వస్తాయి. గతంలో రాత్రిపూట పొలాకాడే పడుకొనేవాళ్లం. కాంగ్రెస్ వస్తే మళ్లీ పాత రోజులొస్తయ్. కాంగ్రెస్ పాలన మాకొద్దు, మాకు కేసీఆర్ సారూ ఇస్త్తున్న 24గంటల కరెంటే ముద్దు. కాంగ్రెస్ గ్యారెంటీలపై నమ్మకం లేదు. కర్ణాటక రైతులు పడుతున్న బాధలు మాకొద్దు. కరెంట్ కోసం పడిగాపులు కాసే ప్రభుత్వం మాకొద్దు. మూడు గంటల కరెంట్తో పారిన పొలానికే మళ్లీ నీరు సరిపోయోది కాదు. రైతులపై కాంగ్రెస్ కక్ష కట్టింది. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వద్దు వారి మాటలపై నమ్మకం పోయింది. రైతులు బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న కరెంట్ తో హాయిగా ఉంటున్నరు. రేవంత్రెడ్డికి రైతులపై అవగాహన లేదు.
కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్లు 10హెచ్పీ బోర్మోటర్ను ఉపయోగించినైట్లెతే అది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కాంగ్రెస్ పార్టీ తనకు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ.. రైతులను ఆగం చేయడానికి పూనుకుంది. కాంగ్రెస్ హయాంలో లోవోల్టేజీ కారణంగా 5హెచ్పీ మోటర్కే కరెంటు సరిపడక మోటర్లు, స్టార్టర్లు కాలిపోతుండే. ట్రాన్స్ఫార్మర్లకు అధిక లోడు పడి ప్రతిరోజూ ఫీజులు ఎగిరిపోయేవి. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవి. మోటర్లు తరచూ కాలిపోవడంతో పంటలు పండక అప్పులు మోపెడయ్యేవి. 10హెచ్పీ మోటర్ను పరిశ్రమల వారు వాడుతారు. అలాంటి మోటర్లను రైతులు పెట్టాలంటే రూ.లక్షలకు పైగా ఖర్చవుతుంది. ఆ ఖర్చును ఎవరు భరించాలి. కాంగ్రెస్ పార్టీ రైతులను అయోమయంలో పడేస్తుంది. 10హెచ్పీ మోటర్ పెడితే అధిలోడ్ పడి ఇప్పుడున్న ట్రాన్స్ఫార్మర్లు పనిచేయవు. మళ్లీ కొత్తవి బిగించాలంటే అది సాధ్యమయ్యే పనికాదు. అలాగే 10హెచ్పీ వాడితే ఇదివరకు ఉన్న పైప్లైన్ను మార్చి కొత్తగా పైప్లైన్ వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. రైతులమీద మోయలేని భారం పడుతుంది. కాంగ్రెస్ నాయకులు రైతులను ముంచేందుకే పుటకోమాట మాట్లాడుతున్నరు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ఇబ్బందులు తెలుసుకుని వ్యవసాయానికి 24గంటల విద్యుత్ ఇస్తుంది. పంటలు బాగా పండుతున్నయ్. ఇప్పుడున్న కరెంటుతో రైతులకు ఇబ్బందేమిలేదు. 10హెచ్పీ మోటార్లు ఏర్పాటు చేసుకోవాలంటే రైతులు మరలా అప్పుల పాలవడం ఖాయం. అందుకే కాంగ్రెస్కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.
24గంటల విద్యుత్ వద్దని 5గంటల విద్యుత్ చాలని రేవంత్రెడ్డి చెప్పడం హస్యాస్పందంగా ఉంది. 5గంటల విద్యుత్ ఇస్తే పంటలు ఎండి రైతులకు పెట్టిన పెట్టుబడులు రాక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొంటుంది. గతంలో కాంగ్రెస్ నాయకులు విడతలవారీగా ఆరుగంటల విద్యుత్ ఇచ్చేవారు. దీంతో ఎంతోమంది రైతులు మృతిచెందారు. వారిని ఆదుకున్న పాపన పోలేదు కానీ 24గంటల విద్యుత్ ఇస్తున్న కేసీఆర్ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. 24గంటల విద్యుత్ ఇవ్వడంతో రైతుకు పట్టెడన్నం దొరుకుతూ ఇతర రాష్ర్టాల కూలీలకు ఉపాధి కల్పిస్తున్నరు. 10హెచ్పీ మోటర్లు మనకు అవసరం లేదని, విద్యుత్ పుష్కలంగా ఉంటే 10 హెచ్పీ మోటర్ ఎందుకు. కాంగ్రెస్ వస్తే రాష్ట్రం అంధకారంలో వెళ్లడమే కాకుండా వలసలు పెరుగుతయి. ప్రజలు, రైతులను కష్టాలోకి నెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది.
కాంగ్రెస్ పాలనలో టాన్స్ఫార్మర్లు రోడ్డుపై పెట్టి ధర్నాలు చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. కాంగ్రెసోళ్లు ఎవుసానికి మూడు గంటలు ఆరు గంటలు అంటున్నరు. మూడు గంటల కరెంటు ఎప్పుడిస్తరు. రాత్రికి ఇస్తారా? పగలు ఇస్తారా?. రైతులు పంటలకు నీళ్లు పెట్టాలంటే పొలాల దగ్గర పాములు, తేళ్ల కుడుతుంటయి. రాత్రికి కరెంటు మోటర్లు పెట్టడానికి వెళ్లిన రైతులు ఎంతోమంది పాముకాటు, కరెంటు షాక్కు గురై చనిపోయారు. మూడు గంటల కరెంటుతో రైతులకు మళ్లీ కష్టాలు మొదలవుతాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న కరెంటుతో పంటలు పండించుకోవడమే కాకుండా పశువులు, గేదెలకు గడ్డిని పెంచుకోవడానికి సరిపోతుంది. మూడు గంటలతో పంటలేడ పండుతయి. గడ్డిని కూడా పెంచలేం. ఇప్పుడున్న కరెంటుతోనే అవసరమున్న కాడికి పెట్టుకుంటం. అవసరం లేని సమయంలో మోటర్లు బందు చేసుకుంటున్నం. పగటిపూటనే పొలం దగ్గర ఉండి పంటలకు నీళ్లు పారిస్తున్నం. రైతులు సుఖసంతోషాలతో ఉన్నారు.
ఎవుసం చేసేటోళ్లకు మాత్రమే తెలుసు ఎంత కరెంట్ అవసరమో. గతంలో రాత్రిపూట 3గంటలు పగటిపూట 3గంటలు ఇచ్చేది. రాత్రిపూట పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నోళ్లు చాలామటుకున్నరు. 3హెచ్పీ మోటర్లతో పంట పొలాలకు నీరు సరిపోతుంది. దాంతోనే పంటలు పండిస్తున్నం. అదనంగా 10హెచ్పీ మోటర్లు కొని పైపులైన్లు సైతం కొనుగోలు చేయాలంటే దాదాపు రూ.లక్షా, లక్షా 50వేల వరకు ఖర్చవుతుంది. అయినా నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇచ్చే ప్రభుత్వాన్ని వొదిలేసి ఆరిగోసలు పెట్టే కాంగ్రెస్ మాకేందుకు. అయిన సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి. ఏ ప్రభుత్వం చేయలేదు రైతులకు ఇంతమంచిగ. కేసీఆర్ను తప్ప ఎవరిని నమ్మే పరిస్థితుల్లో లేరు రైతులు. నేనైతే సచ్చేవరకు కేసీఆర్కే నా ఓటు.
కాంగ్రెసోళ్లు రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నరు. ఏవేవో హామీలు చెప్పి ఓట్లడుగుతున్నరు. వాళ్లు గతంలో చేసిందేమిటో అందరికీ తెలుసు. ఇయ్యాల ఏదో చేస్తమని అంటే ఎవ్వరూ ఆ పార్టీని పట్టించుకుంటలేరు. ఇగ మూడు గంటల కరెంటు చాలని ఆ పార్టీ లీడర్ రేవంత్రెడ్డి మాట్లాడుతున్నడు. నాకు 3ఎకరాల భూమి ఉన్నది. మేము గతంలో కరెంటు కష్టాలతోటి, బిల్లులతోటి ఒకటే పంట తీస్తుంటిమి. గిప్పుడు సీఎం కేసీఆర్ సారు రైతులకు 24గంటల కరెంటు ఇస్తున్నరు. గత ప్రభుత్వాల కాలంలో నీళ్లు లేక, కరెంట్ లేక భూమి బీడుగా మారింది. బతకడమే చానా కష్టమైంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ చెరువుల పూడికతీత పనులు చేపట్టి కట్టలను నిర్మించిన్రు. ఇంకా 10హెచ్పీ మోటర్ పెట్టుకోవాలంటున్నది. ఎట్ల పెట్టుకుంటరు. ఎవరు కొనిస్తరు. వాళ్లు కొనిస్తరా.. చెప్పాలి. కాంగ్రెస్ను నమ్మితే మళ్లీ పాత కథే అయితది. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలు అన్నీఇన్నీ కావు. ఏ నాడూ కంటినిండా నిద్ర కూడా పోలేదు.
కరెంట్ కోసం రాత్రంతా జాగారం చేసేటోళ్లం. రాత్రిళ్లు పొలాల దగ్గరకు పోతే పాములు, తేళ్లు కరిచేవి, అడవి పందులు ఎంబడి పడేటియి. గతంలో కరెంట్ షాకులతో ఎందరో రైతులు చనిపోయిన్రు. గా బాధలు మళ్లీ రావద్దు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆ బాధలు తీరినయి. 24గంటల ఫ్రీ కరెంట్ ఇస్తున్నరు. ఎప్పుడంటే అప్పుడు పోయి పొలానికి నీళ్లు పెట్టుకుంటున్నం. రాత్రిపూట బాయిల కాడ పండే బాధలు పోయినయి. గిప్పుడు సాగుకు 24 గంటలు ఎందుకు.. మూడు గంటలు చాలదా అని కాంగ్రెస్ నాయకులు అంటన్నరట. ఎట్ల సరిపోతది. వాళ్లు ఎన్నడన్నా ఎవుసం చేసిన్రా..? మా రైతులకు మళ్లీ నరకం పడేస్తరా..? మేం మోసపోం. గతంలో పంటలు వేద్దామంటే కరంటు సక్కగా ఉండేది కాదు. వానలు పడితే పంట దిగుబడులు మంచిగ వచ్చేటియి. లేదంటే పెట్టుబడులు కూడా రాకపోయేది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు 24గంటల కరెంటు ఇస్తున్నరు. ఇగ గప్పటి నుంచే రెండు పంటలు సాగు చేస్తున్నం. కరెంట్ ఉండడంతో నీళ్లు పుష్కలంగా ఉంటున్నయి. దీంతో నీళ్లు దిగుబడులు కూడా మస్తుగ ఆస్తున్నయ్. 24గంటల కరెంటిచ్చే బీఆర్ఎస్సే మాకు కావాలె.
తెలంగాణలో పొరపాటున కాంగ్రెస్ వస్తే రైతులు వ్యవసాయానికి కరెంట్ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది.గతంలో వరి చేన్లకు నీళ్లు పారపెట్టేందుకు ఎప్పుడు కరెంట్ వస్తే అప్పుడు చేన్లకు వెళ్లి రాత్రి పగలు తేడా లేకుండా బోర్లు స్టార్ట్ చేయడానికి వెళ్లి ప్రమాదాలకు గురైయ్యే వాళ్లు చాలామంది. అలాగే పాముకాట్లు , విద్యుత్ షాక్లతో చాల మంది రైతులు చనిపోయారు.ఇప్పుడు తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నది బీఆర్ఎస్ రైతు లంతా బీఆర్ఎస్కు అండ గా ఉండి కేసీఆర్ను అత్య ధిక మెజార్టీతో గెలిపించు కోవాలి. కాంగ్రెస్ వాళ్లు త్వరలో జరగనున్న శాస నసభ ఎన్నికల్లో అమలు కాని మోసపూరిత హామిలు ఇస్తున్నది.మన పక్కనే ఉన్న కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అక్కడ వ్యవసాయానికి 5 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తుంది. మన రాష్ట్రంలో మాత్రం వ్యవసాయానికి 3 గంటలు కరెంట్ సరిపోతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చెబుతున్నాడు .అది చెనుకు ఏ మూలకు వ్యవసాయ నీరు పారడానికి పనికి రాదు. అలాగే 10 హెచ్పీ మోటర్లను బోర్లకు బిగించుకోవాలని చెబుతున్నారని అలా చేస్తే రైతు వ్యయ ప్రయాసాలతో ఇబ్బందులకు గురికాక తప్పదన్నారు.ప్రస్తురం మన దగ్గర బోర్లు 2,3 ఇంచుల నీరు మాత్రమే వస్తుంది.పెద్ద మోటార్లు కనుక బిగిస్తే మోటర్కు నీరు అందని పరిస్థితి ఏర్పడుతుంది.భూగర్బ జలాలు కూడ చాల లోతుకు పడిపోయి చాల ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుంది.కావున రైతులు మోసపూరిత హామిలు నమ్మకుండ బిఆర్ఎస్ వెంట అండగా ఉండాలి. రైతుల మేలు కోరే సీఎం కేసీఆర్ మళ్లీ రావాలి.
కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో కరెంటు ఎప్పుడొస్తదో తెలువని పరిస్థితి ఉండేది. మల్ల ఇప్పుడు గనుక కాంగ్రెస్ పార్టీ గనుక వస్తే మల్లా కరెంటు కోసం దినమంతా ఎదురుచూస్తూ ఉండాల్సిన పరిస్థితి వస్తది. గతంలో వ్యవసాయం కోసం లోవోల్టేజీతో మోటరు పంపుసెట్టు పనిచేయక, సింగల్ ఫేస్ కరెంటుతో బావుల వద్ద ఎన్నో తిప్పలు పడ్డం. కేసీఆర్ కొట్లాడి తెచ్చిన తెలంగాణలో ఇప్పుడు కరెంటు పుల్లుగా ఉంది. సార్ పుణ్యాన కరెంటు కష్టాలు తీరినయ్. దినమంతా కరెంటు ఇస్తున్నడు. నాకు ఉన్న 6ఎకరాల పొలంలో వరిపంట వేసుకున్న. పొద్దున వెళ్లి మోటరు చాలు చేసి వస్తే సాయంత్ర వరకు పొలం మొత్తం పారుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఓట్లు వచ్చినప్పుడు ఊర్లల్లోకి వచ్చి, ఏదేదో చేస్తామని గొప్పలు చెప్పుకుంటరు. అప్పుడియ్యలేనోళ్లు ఇప్పుడెట్లా ఇస్తరు. వారిమీద నమ్మకం లేదు. మూడు గంటలు కరెంటు సాలు అన్నవారు మల్లా వస్తే మళ్లీ పాత కష్టాలు వస్తయ్. మాకు ఇబ్బందులు రాకుండా ఉండాలంటే కేసీఆర్ సారే మళ్లీ సీఎం కావాలి.