మహబూబ్నగర్టౌన్, జూలై 30 : ముస్లిం లు సంప్రదాయంగా పాటించే ఇస్లామిక్ సంవత్సరం (మొహర్రం మాసం) ఆదివారం నుంచి ప్రారంభం కానున్నది. అశుర్ఖానాల్లో (మసీదులు) పీర్లను ప్రతిష్ఠించనున్నారు. ముస్లిం మ తస్తుల హిజరీశకం 1,444 సంవత్సరానికి చేరుకున్నది. చాంద్రమాసం ప్రకారం ఇస్లామిక్ క్యాలెండర్ మొహర్రం 1వ తేదీన సంవత్సరాదిగా లెక్కించడం ఆనవాయితీ. మహ్మద్ ప్రవక్త మనుమడు ఇమామే హుస్సేన్ తదితరులు ఇ స్లాం ధర్మాన్ని కాపాడేందుకు చేసిన యుద్ధంలో వీరమరణం పొందుతారు. స్ఫూర్తి ప్రదాతల వీరత్వం, త్యాగాలకు ప్రతీకగా మొహర్రం పండుగను కొన్ని తరాలుగా జరుపుకొంటున్నా రు. పది రోజులు సంతాప దినాలుగా పాటిస్తా రు. మొహర్రం మాసంలో ఆయా గ్రామాల్లో పీర్లను ప్రతిష్ఠిస్తారు. జిల్లా కేంద్రంతోపాటు పట్టణంలోని పాతపాలమూరు, వీరన్నపేట, టీడీగుట్ట, రామయ్యబౌలి, ఎదిర, అప్పన్నపల్లి, దివిటిపల్లి తదితర ప్రాంతాల్లో పీర్ల పం డుగ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. జి ల్లాలోని కోయిలకొండలో జరిగే వేడుకల కు ప్రత్యేక స్థానం ఉన్నది. ఇక్కడికి జిల్లాతోపాటు కర్ణాటక, రాయిచూర్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పీర్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు.