అలంపూర్, ఏప్రిల్ 22 : నాగర్కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా అలంపూర్ చౌరస్తాలోని ఏజీఆర్ ఫంక్షన్ హాల్లో మంగళవారం నాగర్కర్నూల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై దిశా నిర్ధేశం చేయనున్నారు.
ఉదయం 9గంటలకు నిర్వహించే స మావేశానికి నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు హాజరుకానున్నారు. సమావేశానికి అలంపూర్ ని యోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కా ర్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని శ్రేణులు పిలుపునిచ్చారు.