వెల్దండ, డిసెంబర్ 24 : పురాతన ఆలయాలు, శిల్పాలు, శాసనాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ నాగిరెడ్డి అన్నారు. వెల్దండ మండలం రాచూర్లో గ్రామస్తులు కోవూరి వెంకట్రావు, బెక్కిరి సురేశ్రెడ్డి ఇచ్చిన స మాచారం మేరకు పురావస్తు పరిశోధకుడు డాక్టర్ నాగిరెడ్డి ఆదివారం రాచూర్ గ్రామంలో హనుమా న్ శివాలయం, భైరవ, కేశవ, పోచమ్మ ఆలయాలను, శిల్పాలు, శాసనాలను క్షుణ్ణంగా పరిశీలించా రు.
హనుమాన్ ఆలయం ముందున్న రాతి కలశం, ఆలయంలో పూడుకుపోయిన శాసనం, రంగులతో కళతప్పిన సప్తమాతల శిల్పం, శిథిల శివాలయం లో భిన్నమైన భైరవ విగ్రహం, పోచమ్మ గుడి వద్ద అమ్మవారు, భూమిలో కూరుకుపోయిన త్రికుటాలయం, కప్పురాలు, జారిపడిపోయిన శివాలయాలను పరిశీలించారు. శాసనాలను పరిశీలించిన ఆ యన రాచూర్కు వెయ్యేళ్ల చరిత్ర ఉందని శాసనాలల్లో ఈ ఊరి పేరు రావితొర్రు, రావితోరుతి అని ఉందని తెలిపారు. చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన ఆలయాలు, శిల్పాలు, శాసనాలను పదిలపర్చి భా వితరాలకు అందించాలని గ్రామస్తులను కోరారు.