నాగర్ కర్నూల్ : మండలంలోని కుమ్మెర గ్రామం మల్లన్న స్వామి ఆలయం ( Mallanna Swamy Temple ) వద్ద ఈనెల 18న జరిగిన ఘర్షణలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన రెండు నెలల పాప కుటుంబాన్ని నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ( Marri Janardhan Reddy ) ఆదివారం పరామర్శించారు.
అధికార అండతో అరాచకాలకు పాల్పడుతూ దైవ దర్శనానికి వచ్చిన అమాయక కుటుంబంపై దాడి చేయడంతో పాటు పాప మరణానికి కారకులైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.బాధిత కుటుంబాన్ని పార్టీ పరంగా అన్ని విధాలుగా ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.బాధితులు ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోకుండా బాధితులపైనే కేసు నమోదు చేయడం దుర్మార్గమని అన్నారు.