గద్వాల, డిసెంబర్ 8 : ప్రజలకు పాలనను చేరు వ చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. అన్ని శాఖల్లో అధికారులు, సిబ్బందిని నియమించారు. కానీ, ప్రభుత్వ లక్ష్యానికి అధికారులు నీరుగారుస్తున్నారు. తమకు ఇష్టం వచ్చిన సమయానికి డ్యూటీకి వస్తున్నారు. కొం దరు అధికారులు, కిందిస్థాయి సిబ్బంది హైదరాబాద్, కర్నూల్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే ఉద్యోగులు ఉదయం 11:30 గంటలకు వచ్చే తుంగభద్ర సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు వచ్చి సాయంత్రం నాలుగు గంటలకు మళ్లీ సూపర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు వెళ్లిపోతున్నారు.
కర్నూల్ నుంచి వచ్చే ఉద్యోగులు ఉదయం 11 తర్వాత వచ్చి సాయంత్రం ఐదు కాకముందే వెళ్లిపోతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన జిల్లా అధికారులు, కలెక్టర్ పట్టించుకోకపోవడంతో ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యానవన, సివిల్సప్లయ్, సీపీవో, వ్యవసాయశాఖ, పంచాయతీరాజ్, డీఆర్డీఏ, డీటీవో కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు విధులకు ఎప్పుడుపడితే అప్పుడు హాజరవుతున్నారు. దీంతో సమస్యలు విన్నవించుకోవడానికి వచ్చిన ప్రజలు ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. ఉద్యానవన, ప ట్టు పరిశ్రమ శాఖ కార్యాలయానికి ఉ ద్యోగులు 12:30 తర్వాత వస్తున్నా రు. విధులపై నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.