నారాయణపేట, జనవరి 30 : పేదల సంక్షేమమే ప్రభు త్వ ధ్యేయమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్. రాజేందర్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయ ఆవరణలో సోమవారం 115 మంది లబ్ధిదారులకు షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. సీఎం సహాయనిధి నుంచి పట్టణానికి చెందిన గౌసియాబేగానికి రూ.60వేలు, సత్యప్పయాదవ్కు రూ.36వేలు మంజూరయ్యాయి. మంజూరైన చెక్కులను పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, వైస్చైర్మన్ హరినారాయణ భట్టడ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో ఫిబ్రవరి 5న జరుగను న్న టీయూడబ్ల్యూజేహెచ్ 143 మహాసభలకు విలేకరులు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆ సం ఘం జిల్లా ఇన్చార్జి గోవర్ధన్గౌడ్ అన్నారు. సోమవారం ప ట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఆవరణలో మహాసభలకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి అల్లం నా రాయణ చేస్తున్న కృషి ప్రశంశనీయమన్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర మహాసభలలో జిల్లాకేంద్రానికి చెందిన నవీన్కుమార్ను జాతీయ కౌన్సిల్ సభ్యులుగా, అనంతరాము, గణపరఘును రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకున్నట్లు చెప్పా రు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎ న్నుకున్నారు.
జర్నలిస్టులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయ ఆవరణలో టీయూడబ్ల్యూజేహెచ్ 143 నూతన కా ర్యవర్గ సభ్యులను ఆయన శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రూ.100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నా రు. నూతన కార్యవర్గ జర్నలిస్టుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేయాలన్నారు.
టీయూడబ్ల్యూజేహెచ్ 143 జిల్లా అధ్యక్షుడిగా ఆనంద్కుమార్గౌడ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా అర్షద్ ఫైస ల్, ప్రచార కార్యదర్శిగా సురేశ్కుమార్, గౌ రవ సలహాదారులుగా ముజాహిద్ సిద్దిఖీ, అంబదాస్లను ఎన్నుకున్నారు.
నారాయణపేట రూరల్, జనవరి 30 : మండలంలోని అప్పిరెడ్డిపల్లి, ఊటకుంటతండాల్లో గ్రామ పంచాయతీ నూతన భవనాల నిర్మాణానికి సోమవారం ఎ మ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆయా గ్రా మాల్లో రూ.20 లక్షలతో నూతన పంచాయతీ భవనాలను నిర్మించనున్నారు. ఎమ్మెల్యే ఊటకుంట తండాలో ప్రజలతో మాట్లాడారు. సర్పంచ్ సీతమ్మ, ఉపాధ్యాయులు తం డాలో పాఠశాల నూతన భవనాన్ని మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యే స్పందించి మన ఊరు మన బడి కార్యక్రమం నుంచి నిధులు మంజూరు చేయిస్తామన్నారు. అలా గే సీఎం రిలీఫ్ఫండ్ నుంచి మంజూరైన రూ.46,000 చె క్కును కిష్టమ్మకు ఎమ్మెల్యే అందజేశారు.
మండలంలోని ఎక్లాస్పూర్లో ఫిబ్రవరి 5న జరగనున్న బాలాజీస్వామి రథోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను సోమవారం సర్పంచ్ జమునాబాయి, ఎంపీటీసీ రాం రెడ్డి, మాజీ ఆలయ కమిటీ అధ్యక్షుడు, మున్సిపల్ వైస్చైర్మన్ హరినారాయణ భట్టడ్ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డికి అం దజేశారు. ఉత్సవాల్లో పాల్గొనాలని ఎమ్మెల్యేను ఆహ్వానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, జెడ్పీటీసీ అంజలి, బీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు రాములు, నాయకులు పాల్గొన్నారు.
మండలంలోని అమ్మిరెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ స్వప్న వెంకట్రామ్రెడ్డి స్వగృహంలో సోమవారం నిర్వహించిన శివ మహాపడిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. అంతకుముందు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎస్పీ బాలు అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు మహిపాల్రెడ్డి బృందం పాడిన పాటలు శివ స్వాములు, గ్రామస్తులను ఎంతగానో ఆకట్టుకొన్నాయి. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో జాజాపూర్ సర్పంచ్ సుగంధమ్మ, రైతుబం ధు సమితి జిల్లా సభ్యుడు కోట్ల జగన్మోహన్రెడ్డి, బీఆర్ఎస్ మండల కార్యదర్శి రవీందర్గౌడ్, స్వాములు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గ్గొన్నారు.
మండలంలోని అప్పక్పల్లిలో కంటివెలుగు కార్యక్రమా న్ని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి సోమవారం ప్రారంభించా రు. శిబిరంలోని వివిధ విభాగాలను పరిశీలించి పలువురికి అద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో కంటివెలుగు కార్యక్రమంతో కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలను అందజేస్తున్నారన్నారు.