దేవరకద్ర, డిసెంబర్ 4 : నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును నిరంతరం గౌరవిస్తామని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆల మాట్లాడుతూ తొమ్మిదిన్నరేండ్లలో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రజల అభివృద్ధి, సంక్షే మం కోసం అలుపెరుగకుండా పనిచేసామన్నారు. ఓట్లు వేసిన ప్రజలను ఎప్పటికీ విస్మరించకూడదని తమ నాయకుడు తమ కు తరుచూ చెప్పేవారన్నారు. తమ పార్టీ ఓడిపోయినా ప్రజలకు సేవ చేసేందుకు అందుబాటులో ఉంటామన్నారు. ప్రజల కోణంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త ప్రభుత్వం పని చేస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఎన్నికలో గెలుపోటములు సహజమని, దీనిని స్పోర్టీవ్గా తీసుకొని ముం దుకు సాగుతామన్నారు. తన విజయాన్ని ఆకాంక్షిస్తూ ఇప్పటి వరకు శ్రమించిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు అభిమానులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపా రు. ఎన్నికలో ఓడినా నిరంతరం పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటాన్నారు.
నియోజకవర్గ ప్రజలు 87వేలకు పైగా ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. తక్కువ మెజార్టీతో మనం ఓడిపోయాం.. కార్యకర్తలు అధైర్యపడొద్దు అందరికీ నిరంతరం అదుబాటులో ఉంటా ను. ప్రస్తుతం నియోజవర్గంలో ఒక ఎమ్మెల్యే మినహా నియోజకవర్గంలో ఉన్న ప్రతిప్రజాప్రతి నిధులు అంతా బీఆర్ఎస్ పార్టీ వాళ్లే ఉన్నా రు. కావున కార్యకర్తలు ఎప్పుడూ నిరుత్సాహం చెందకూడదన్నారు. తనపై గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్రెడ్డికి, నూతనంగా ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుగా ఆయన శుభాకాంక్షాలు తెలిపారు. సమావేశంలో ఎంపీపీ రమాదేవి, ముడా డైరెక్టర్ కర్ణంరాజు, సహకార సం ఘం చైర్మన్లు డోకూర్ నరేందర్రెడ్డి, రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జెట్టి నరసింహారెడ్డి, నాయకులు కాటం ప్రదీప్కుమార్గౌడ్, శ్రీకాంత్ యాదవ్బాలరాజు, కొండ శ్రీనివాస్రెడ్డి, భాస్కర్రెడ్డి, శ్రీకాంత్, జహంగీర్, వేణుగోపాల్, ఉస్కిల వెంకట్రాములు, యుగేంధర్రెడ్డి, రాధాకృష్ణ, సయ్య ద్ జక్కి, తమ్మన్నతోపాటు వివిధ గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.