పెద్దమందడి, ఫిబ్రవరి 1 : కన్నతల్లిని కొడుకు గొంతుకోసి చంపిన ఘటన వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని బండమీదితండాలో గురువారం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని అమ్మపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న బండమీదితండాకు చెందిన రాజునాయక్.. హైదరాబాద్లోని ప్లాట్ అమ్మాలని తన భార్యతో తరుచూ గొడవ పడేవాడు. తన భార్యకు అతడి తల్లి చిన్నమ్మ (50) కూడా మద్దతు పలుకుతుందని భావించాడు.
ఈ క్రమంలో కొన్ని రోజులుగా మతిస్థిమితం కోల్పోయిన రాజునాయక్ గురువారం ఉదయం ఇంట్లో ఉ న్న ఈలపీటతో చిన్నమ్మ గొంతు కోసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న కొత్తకోట సీఐ రత్నం, ఎస్సై హరిప్రసాద్ ఘటనా స్థలికి చేరుకొని రాజునాయక్ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహన్ని పోస్టుమా ర్టం నిమిత్తం వనపర్తి జిల్లా దవాఖానకు తరలించారు.