మహబూబ్నగర్టౌన్, డిసెంబర్ 27: ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వార్డులో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ తెలిపారు. బుధవారం దరఖాస్తు స్వీకరణ సంబంధించి వివరాలు తెలిపారు. నేటి నుంచి జనవరి 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరణ పక్రియ కొనసాగుతుందన్నారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు 4 వార్డులు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు 4 వార్డులు మొత్తం 8 వార్డులో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపారు. 49 వార్డులో 54.370 ఇండ్లకు సంబంధించి 543 కౌంటర్లు ఏర్పాటు చేశామని, వార్డుకు ప్రత్యేక అధికారి, సిబ్బందిని కేటాయించినట్లు పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వీకరించాలని మున్సిపల్ అధికారులు, సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు.
* డిసెంబర్ 28న 11వ వార్డు, 23, 44, 49, 1, 3, 5, 19
* డిసెంబర్ 29న 18, 33, 43, 46, 6, 7, 13, 16
* డిసెంబర్ 30న 21, 24, 25, 29, 4, 35, 40, 47
* జనవరి 2న 14, 15, 42, 45, 2, 8, 12
* జనవరి 3న 10, 22, 37, 41, 30, 32, 34, 36
* జనవరి 4న 20, 28, 38, 39, 48, 17, 26, 27
* జనవరి 5న 31వ వార్డు
మూసాపేట, డిసెంబర్ 27 : ఈనెల 28వ తేదీ నుంచి జనవరి 4వరకు ఆరు గ్యారెంటీల అమలుకు ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరించేందుకు అధికార యంత్రంగం ఏర్పాట్లు చేశారు. మూసాపేట మండలంలోని తుంకినీపూర్ పంచాయతీ వద్ద ఉదయం 8గంటల నుంచి, అచ్చాయిపల్లి ప్రభుత్వ పాఠశాల వద్ద మధ్యాహ్నం 2గంటల నుంచి తాసీల్దార్ బహ్మంగౌడ్ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా మండలంలోని చక్రాపూర్ గ్రామ పంచాయతీ వద్ద ఉదయం 8గంటల నుంచి, స్ఫూర్తితండా ప్రభుత్వ పాఠశాల వద్ద మధ్యాహ్నం 2గంటల నుంచి ఎంపీడీవో స్వరూప ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరించనున్నట్లు తెలిపారు.
మూసాపేట(అడ్డాకుల), డిసెంబర్ 27 : నియోజకవర్గంలోని అడ్డాకుల మండలం చిన్నముగనల్చేడ్ గ్రామ పంచాయతీ వద్ద ఉదయం 8గంటల నుంచి, మధ్యాహ్నం 2గంటల నుంచి పెద్దమునగల్చేడ్ గ్రామ పంచాయతీ వద్ద దరఖాస్తులను తాసీల్దార్ ఘన్సీరామ్ స్వీకరించనున్నట్లు తెలిపారు. దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలంలోని కాటవరం గ్రామ పంచాయతీ వద్ద ఉదయం 8గంటలకు, తిమ్మాయిపల్లి గ్రామ పంచాయతీ వద్ద మధ్యహ్నం 2గంటల నుంచి ఎంపీడీవో మంజుల ప్రజల నుంచి ఆరు గ్యారెంటీలకు దరఖాస్తులను స్వకరించనున్నట్లు తెలిపారు.
భూత్పూర్, డిసెంబర్ 27 : ప్రజాసమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మండల ప్రత్యేధికారి సాయిబాబ తెలిపారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. 28న పోతులమడుగు, భట్టుపల్లి, అన్నాసాగర్, వెల్కిచర్ల, 29న తాటికొండ, కొత్తమొల్గర, రావులపల్లి, కప్పెట, 30న మద్దిగట్ల, శేరిపల్లి(హెచ్), పాతమొల్గర, హస్నాపూర్, జనవరి 2వ తేదీన లబండికుంట, కరివెన, పెద్దతండా, చౌలతండా, 3న తాటిపర్తి, కొత్తూర్ గ్రామాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2గంటల నుండి 6గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో ఎంపీవో విజయకుమార్, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
నవాబ్పేట, డిసెంబర్ 27 : ప్రజాపాలన గ్రామ సభలను పకడ్బందీగా నిర్వహించాలని తాసీల్దార్ మల్లికార్జునరావు పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం ప్రజాపాలన గ్రామసభల నిర్వహణపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 5టీంలను ఏర్పాటు చేసి గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీపీ అనంతయ్య, ఎంపీడీవో శ్రీలత, ఎంపీవో భద్రునాయక్, ఏవో కృష్ణకిశోర్, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
మక్తల్ టౌన్, డిసెంబర్ 27: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీలలో ఐదు అంశాలకు సంబంధించిన దరఖాస్తులను అధికారులు స్వీకరించాలని మక్తల్ మండల స్పెషల్ ఆఫీసర్ జాన్ సుధాకర్ చెప్పారు. బుధవారం మధ్యాహ్నం మక్తల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
హన్వాడ డిసెంబర్ 27: నేటి నుంచి జనవరి 6వ తేదీ వరకు మండలంలో ప్రజా పాలన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎంపీడీవో ధనుంజయగౌడ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
మరికల్, డిసెంబర్ 27: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన దరఖాస్తులను గురువారం నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు ఎంపీడీవో శ్రీనివాసులు తెలిపారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయాన మాట్లాడుతూ ఈనెల 28న మరికల్, కన్మనూర్ గ్రామాల్లో, 29న కన్మనూర్, మద్వార్, పెద్దచింతకుంట, తీలేరు, 30న తీలేరు, జిన్నారం, ఎలిగండ్ల, పుసల్పాడ్, రాకొండ, వచ్చేనెల 2న బుడ్డెగానితండా, అప్పంపల్లి, ఏక్లాస్పూర్, పల్లెగడ్డ, పస్పుల, వెంకటపూర్, ఇబ్రహీంపట్నంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఊటూర్, డిసెంబర్ 27: అర్హులైన ప్రతి ఒకరికీ సంక్షేమ ఫలాలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ ఎలోటి లక్ష్మీ అన్నారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాపాలన కార్యక్రమంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో ఈనెల 28 నుంచి జనవరి 6వరకు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఐదు గ్యారెంటీలకు సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అన్నిగ్రామాల్లో దండోరా వేయించాలని సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులను కోరారు. కార్యక్రమం అమలుపట్ల ఎంపీడీవో రమేశ్కుమార్ అవగాహన కల్పించారు.
దేవరకద్ర రూరల్(కౌకుంట్ల), డిసంబర్ 27 : చిన్నచింతకుంట మండలంలోని చిన్నవడ్డెమాన్, ఉంద్యాల గ్రామాల్లో తాసీల్దార్ కృష్ణయ్య, చింతకుంట, ఏదులాపూర్ గ్రామాల్లో ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, కౌకుంట్ల మండలంలో కౌకుంట్ల, అప్పంపల్లి గ్రామాల్లో తాసీల్దార్ ఎల్లయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
నారాయణపేట రూరల్, డిసెంబర్ 27: పేట మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ప్రజాపాలన గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో వెంకటయ్య తెలిపారు. నేడు కొల్లంపల్లి, కోటకొండ, వందర్గుట్టతండా, మీదితండా, 29న జాజాపూర్, తిర్మలాపూర్, కోటకొండ, లింగంపల్లి, పిల్లిగుండ్లతండా, 30న బొమ్మన్పాడ్, పేరపళ్ల, సింగారం, బోయిన్పల్లితండా, లక్ష్మీపూర్, జనవరి 2న శేర్నపల్లి, అప్పిరెడ్డిపల్లి, అభంగాపూర్, చిన్నజట్రం, మేకహనుమాన్తండా, ఊటకుంటతండా, 3న ఏక్లాస్పూర్, అమ్మిరెడ్డిపల్లి, భైరంకొండ, శాసన్పల్లి, అంత్వార్, అప్పక్పల్లి, 4న జిలాల్పూర్, బోయిన్పల్లి గ్రామాల్లో సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ సభల్లో ఎంపీడీవో, తాసీల్దార్, ఎంపీవో, డీటీ, ఏవో అధికారులు హాజరుకానున్నారు.
మరికల్, డిసెంబర్ 27: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన దరఖాస్తులను గురువారం నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు ఎంపీడీవో శ్రీనివాసులు తెలిపారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయాన మాట్లాడుతూ ఈనెల 28న మరికల్, కన్మనూర్ గ్రామాల్లో, 29న కన్మనూర్, మద్వార్, పెద్దచింతకుంట, తీలేరు, 30న తీలేరు, జిన్నారం, ఎలిగండ్ల, పుసల్పాడ్, రాకొండ, వచ్చేనెల 2న బుడ్డెగానితండా, అప్పంపల్లి, ఏక్లాస్పూర్, పల్లెగడ్డ, పస్పుల, వెంకటపూర్, ఇబ్రహీంపట్నంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
గండీడ్, డిసెంబర్ 27: నేటి నుంచి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని ఎంపీడీవో రూపేందర్రెడ్డి తెలిపారు. 28వ తేదీన జంగంరెడ్డి, గండీడ్, గోవిందు పల్లి, జానంపల్లి, 29న కొంరెడ్డిపల్లి ఆశిరెడ్డిపల్లి, వెన్నాచేడ్, 30న అంచన్పల్లి, చెన్నాయిపల్లితండా, రంగారెడ్డిపల్లి, కప్లపూర్, జనవరి 2న సల్కర్పేట్, రెడ్డిపల్లి, జిన్నారం, జిన్నారం తండ, 3న మన్సుర్పల్లి, మన్సుర్పల్లితాండా, జక్లపల్లి, లింగాయిపల్లి, 4న పెద్దవార్వల్, సాలార్నగర్, పగిడ్యాల్, 5న బల్సుర్గొండ, 6న కొండపూర్, పంచలింగాలతండా, చిన్నవార్వల్, రుసుంపల్లిలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యాలయాల వద్ద అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు.
మహ్మదాబాద్, డిసెంబర్ 27: 28న మొకర్లబాద్, మంగంపేట్, కంచన్పల్లి, సంగాయిపల్లి 29న చౌదర్పల్లి, కొలిమితండా, ధర్మాపూర్, 30న పెద్దతండా, గువ్వనికుంటతండా, ముందలితండా, 2న గాదిర్యాల్, ఆముదాల గడ్డతండా, వెంకట్రెడ్డిపల్లి, అన్నారెడ్డిపల్లి తండా, 3న నంచర్ల, మహ్మదాబాద్, 4న ఎల్కిచెరువుతండా, చిన్నాయిపల్లి, 5న దేశాయిపల్లి, మంగంపేట్తండా, 6న జూలపల్లి, శేక్పల్లిలో దరఖాస్తుల స్వీకరణ ఉంటుదని ఎంపీడీవో రూపేందర్ రెడ్డి తెలిపారు.
జడ్చర్ల టౌన్, డిసెంబర్ 27 : మున్సిపాలిటీ పరిధిలో ఈనెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ మహమూద్షేక్ తెలిపారు. గురువారం ఉదయం 8గంటల నుంచి 12గంటల వరకు కావేరమ్మపేట మున్సిపల్ కార్యాలయ సమీపంలోని ఫంక్షన్హాల్లో 1,2 వార్డులకు సంబంధించిన ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అలాగే మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు బాదేపల్లి సాయిమందిర్ సమీపంలో 4,5 వార్డులకు సంబంధించి ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈనెల 29న ఉదయం 6,7 వార్డులు, మధ్యాహ్నం 8,9 వార్డులు, ఈనెల 30న ఉదయం 10, 11 వార్డులు, మధ్యాహ్నం 13,14 వార్డులు, జనవరి 2న ఉదయం 15,16 వార్డులు, మధ్యాహ్నం 17,18 వార్డులు, జనవరి 3న ఉదయం 19, 20 వార్డులు, మధ్యాహ్నం 21, 22 వార్డులు, జనవరి 4న ఉదయం 23, 24 వార్డులు, మ ధ్యాహ్నం 25,26 వార్డులు, జనవరి 5న 27, 3 వార్డులు, జనవరి 6న 12వ వార్డులో ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే మండలంలో గురువారం మాచారంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ప్రారంభించనున్నట్లు ఎంపీడీవో తెలిపారు. వివిధ గ్రామాల్లోనూ దరఖాస్తులు స్వీకరించనున్నారు.