జడ్చర్ల, జనవరి 29 : బాదేపల్లి వ్యవసాయ మా ర్కెట్లో వేరుశనగకు ధర పెరిగింది. గత శుక్రవారం వరకు తగ్గుతూ వచ్చిన ధరలు మళ్లీ పెరగడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత శనివారం రూ.87 అధికం రాగా.. సోమవారం రూ. 220 పెరిగాయి. కందులకు కూడా క్వింటాకు రూ. 200 పెరిగింది. సోమవారం బాదేపల్లి మార్కెట్కు 5,283 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్ఠంగా రూ.7,386, కనిష్ఠంగా రూ.4 వేలు, మధ్యస్తంగా రూ.6,886 ధర పలికింది.
142 క్వింటాళ్ల కందులు రాగా.. గరిష్ఠంగా రూ.9,845, కనిష్ఠంగా రూ.9,269.., 42 క్వింటాళ్ల ఆర్ఎన్ఆర్ ధాన్యం రాగా.. గరిష్ఠంగా రూ.2,973., జొన్నకు గరిష్ఠంగా రూ.5,451, బెబ్బర్లు క్వింటాకు గరిష్ఠంగా రూ. 6,777, మొక్కజొన్నకు గరిష్ఠంగా రూ.2,365 ధర వచ్చినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.