పోలీసు కానిస్టేబుల్ తుది అర్హత పరీక్ష ఆదివారం ప్రశాంతంగాజరిగింది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి మహబూబ్నగర్, భూత్పూర్లో మొత్తం 31 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష కొనసాగింది. ఉమ్మడి జిల్లాలో ఫిట్నెస్, ప్రిలిమ్స్ పరీక్షల్లో 14,384 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. వారికి పరీక్ష నిర్వహించారు. వీరిలో 14,238 (98.98 శాతం) మంది హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. అభ్యర్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోగా ఇన్విజిలేటర్స్ వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. అంతకుముందు బయోమెట్రిక్ను ప్రారంభించారు. పరీక్షను జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ పర్యవేక్షించారు. నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, ఇద్దరు ఏఎస్పీలు, పది మంది సీఐలు, 25 మంది ఎస్సైలతోపాటు 254 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు.
– మహబూబ్నగర్ మెట్టుగడ్డ/ భూత్పూర్, ఏప్రిల్ 30
మహబూబ్నగర్ మెట్టుగడ్డ/భూత్పూర్, ఏప్రిల్ 30: పోలీసు కానిస్టేబుల్ తుది అర్హత పరీక్షను పాలమూరు జిల్లాకేంద్రంలో ఆదివారం ప్రశాంతంగా నిర్వహించినట్లు జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ తెలిపారు. ఉమ్మడిజిల్లాలోని ఫిట్నెస్, ప్రిలిమ్స్లో 14,384 మంది అర్హత సాధించగా.. ఆదివారం డీఐజీ పర్యవేక్షణలో పేట ఎస్పీ వెంకటేశ్వర్లు, 2 ఏఎస్పీ, 10 సీఐ, 25 ఎస్సైలతోపాటు 254మంది సిబ్బంది ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించారు. మహబూబ్నగర్ టౌన్, భూత్పూర్లో మొత్తం 31 పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్ష రాశారు. 14,384మందికి గానూ 14,238మంది (98.98 శాతం) పరీక్షకు హాజరయ్యారని పోలీసు అధికారులు తెలిపారు. ఈక్రమంలో ఓ అభ్యర్థి గుర్తింపుకార్డు ఫొటో మర్చిపోగా అక్కడే ఉన్న కానిస్టేబుల్ రమేశ్ 10 నిమిషాల్లో అతడిని తీసుకెళ్లి ఫొటో తీయించి పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా కానిస్టేబుల్కు అభ్యర్థి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎస్పీ నర్సింహ సదరు కానిస్టేబుల్ను అభినందించారు.