నారాయణపేట, డిసెంబర్ 12 : ప్రతి కేసులో విచారణ పారదర్శకంగా నిర్వహించి శిక్షల శాతం పెంచేందుకు కృషి చేయాలని డీఎస్పీ సత్యనారాయణ సూచించారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలోని సమావేశపు హాల్లో జిల్లాలోని పోలీసు అధికారులతో సోమవారం పెండింగ్ కేసుల పై సమీక్ష నిర్వహించారు. గ్రేవ్, నాన్గ్రేవ్ కేసులపై సీఐలు, ఎస్సైలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసు నమోదు నుంచి చార్జీషీట్ వరకు ప్రతి విషయం కూలంకశంగా పరిశోధించాలన్నారు. పోక్సో, ఎ స్సీ, ఎస్టీ గ్రేవ్ కేసులను త్వరితగతిన విచారణ చేపట్టి 60 రోజుల్లో కోర్టులో చార్జీషీట్ దాఖలు చేయాలన్నా రు. అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి కేసుల ను ఛేదించాలన్నారు. రిసెప్షన్, క్రైమ్ వర్టికల్, టెక్ టీం, స్టేషన్ రైటర్స్ తదితర వర్టికల్ విధులు నిర్వర్తించే అధికారులకు తరచుగా శిక్షణా తరగతులు ని ర్వహించాలన్నారు. రాత్రి పెట్రోలింగ్ నిర్వహించి పాత నేరస్తులను తనిఖీ చేయాలన్నారు. సైబర్ నేరాల నియంత్రణ కోసం గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
సమావేశంలో సీఐలు శ్రీకాంత్రెడ్డి, సీత య్య, రాంలాల్, జనార్దన్, ఎస్సైలు సురేశ్, జగదీశ్, రాము లు, పర్వతాలు, సుధామాధురి, సీసీఆర్బీ, ఐటీ కోర్ టీం, క్లూస్ టీం తదతరులు పాల్గొన్నారు.
చట్ట ప్రకారం పరిష్కరించాలి
బాధితులు అందించిన ఫిర్యాదులను వెంటనే పరిశీలిం చి త్వరితగతిన పరిష్కరించాలని డీఎస్పీ సత్యనారాయణ అన్నారు. పట్టణంలోని ఎస్పీ కాన్ఫరెన్స్ హాల్లో ఆరుగురు బాధితులతో ఆర్జీలు స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులు పెండింగ్లో లేకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సివిల్ ఫిర్యాదులను కోర్టు లో పరిష్కరించుకోవాలని ప్రజలకు సూచించారు.