Mahabubnagar | మహబూబ్నగర్, మార్చి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆ పరిశ్రమ రావడం వాళ్లకు ఇష్టంలేదా..? కాలుష్యం పేరుతో కట్టుకథలు అల్లుతున్నారా? వలస జిల్లా తలరాత మారుతుంటే విపక్షాలకు గిట్టడం లేదా? నిరుద్యోగుల పొట్టగొట్టే ప్రయత్నం జరుగుతున్నదా? పరిశ్రమతో చుట్టుపక్కల ప్రజలు, యువకులకు ఉపాధి లభిస్తుంటే ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారా? అంటే అవుననే రుజువైంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని ఐటీ పార్క్లో రూ.10 వేల కోట్ల పెట్టుబడితో అమర్రాజా బ్యాటరీ కంపెనీతో ప్రభుత్వం ఎం వోయూ కుదుర్చుకున్న నాటి నుంచి కొన్ని దుష్టశక్తులు కట్టుకథలు అల్లడం ప్రారంభించారు. దేశంలోనే అతిపెద్ద లిథియం ఆయాన్సెల్ బ్యాటరీని తయారుచేసేందుకు అమర్రాజా కంపెనీ ప్రభుత్వాన్ని సంప్రదిస్తే.. ఐటీ పార్కులో పెట్టేందుకు ఐటీ, మున్సిపల్ శాఖ మం త్రి కేటీఆర్ ఆహ్వానించారు. ఈ ఫ్యాక్టరీతో జిల్లా స్వరూపమే మారుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. జర్మనీలో స్థిరపడ్డ పాలమూరు జిల్లా యువకులు బ్యాటరీ ఫ్యాక్టరీపై ఆసక్తి చూపిస్తున్నారు. మా జిల్లాలో అంత పెద్ద ఫ్యాక్టరీ వస్తుందా? అని ఆశ్చర్యపోయారు.
విపక్షాలు మాత్రం కాలుష్యం వెదజల్లుతుందని, పచ్చని ప ల్లెలు నాశనం అవుతాయంటూ ప్రజల్లో భయాలు పుట్టిస్తున్నాయి. కాలుష్యం విషయంపై నిజానిజాలు పరిశీలించేందుకు దివిటిపల్లి, ఎదిర, అంబట్పల్లితోపాటు సమీప గ్రామాలకు చెందిన వంద మందిని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆంధ్రప్రదేశ్లోని రేణిగుంటకు పంపించారు. అక్కడ అమర్రాజా బ్యా టరీ ఫ్యాక్టరీని స్వయంగా పరిశీలించారు. ఫ్యాక్టరీలో తయారవుతున్న వాటిని చూపించారు. కాలుష్య కారకాలు.. దాన్ని విసర్జించే లేటెస్ట్ టెక్నాలజీని ఈ బృందానికి వివరించారు. ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రదేశాలను చూసిన ప్రజలు అవాక్కయ్యారు. కాలుష్యం వస్తుందనే మాట పచ్చి అబద్దమని తేటతెల్లమైంది. ఫ్యాక్టరీ చుట్టూ పల్లెల్లన్నీ పచ్చగానే ఉన్నాయి. జనావాసాలు పెరుగుతుండడంతో కాలుష్యం పేరు చెప్పి కొన్ని పా ర్టీలు నాటకాలు ఆడుతున్నాయని గ్రహించారు. ఫ్యాక్టరీని ఐటీ పార్కులోనే పెట్టాలని మంత్రిని గ్రామస్తులు మూకుమ్మడిగా కోరుతున్నారు.
ఏపీలోని అమర్రాజా బ్యాటరీ ఫ్యాక్టరీని కళ్లారా చూసిన జనం.. గ్రామాల్లో విస్తృత చర్చలు జరిపారు. గ్రామానికి చెందిన కొంతమంది గిట్టని వాళ్లు, ప్రతిపక్షాలు కలిసి కాలుష్యం పేరిట అల్లిన కట్టుకథలు పటాపంచలయ్యాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఫ్యాక్టరీ వస్తే తమకు ఎలాంటి నష్టం లేదని తేల్చిపారేశారు. కాగా, ఇటీవల మంత్రి జర్మనీలో క్రీడల సంబురానికి వెళ్తే అక్కడ స్థిరపడ్డ పాలమూరు బిడ్డలు మన జిల్లాకు ఇంత పెద్ద ఫ్యాక్టరీ వస్తుందా? అని ఆశ్యర్యపోయారు. మంత్రి, ఇతర ప్రతినిధుల వద్దకు వచ్చి బ్యాటరీ ఫ్యా క్టరీ వస్తే చాలామందికి ఉపాధి లభిస్తుందని, దేశానికే ఈ పరిశ్రమ తలమానికం అవుతుందని చెప్పారు. కా నీ, కాలుష్యం పేరుతో అడ్డుకుంటున్నారని మంత్రి చె బితే.. ‘కాలుష్యమా..? ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వ చ్చాక కూడా.. ఇలాంటి పుకార్లు నమ్ముతారా?’ అని ఎదురు ప్రశ్నించారు. దేశవిదేశాల్లో ఉన్నోళ్లకు ఉన్న తె లివి.. మన జిల్లాలోని కొంతమందికి లేకపోవడం దురదృష్టకరమని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.