ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ రానే వచ్చింది. బుధవారం సాయంత్రం నెలవంక తొంగి చూడగా.. గురువారం ఈద్ ఉల్ ఫితర్ను జరుపుకొనేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. పండుగ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. ము స్లింల ప్రత్యేక ప్రార్థనల కోసం ఉమ్మడి జిల్లాలోని ఈద్గాలు, మసీదులను ముస్తాబు చేశారు. ఖురాన్ అవతరించిన రంజాన్ మాసం గత నెల 12న ప్రా రంభంకాగా ముస్లింలు ఆధ్యాత్మికతతో గడిపారు.
ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ లేదా రమదాన్. నెల రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో, ని యమ, నిష్టలతో చేపట్టిన ఉపవాస దీక్షలు బుధవారంతో ముగియనున్నాయి. దీంతో గురువారం రం జాన్ పండుగను గ్రామాలు, పట్టణాల్లో ముస్లింలు జరుపుకోనున్నారు. నెలవంక కనిపించిన గతనెల 12వ తేదీ నుంచి రంజాన్ మాసం ప్రారంభమైం ది. ఈ మాసంలో ముస్లింలు అత్యంత కఠిన ఉపవాస దీక్షలను పాటించారు. తెల్లవారుజామున సహెర్, సాయంత్రం ఇఫ్తార్లకు మాత్రమే పరిమితమయ్యారు. పచ్చి మంచినీళ్లు ముట్టుకోకుండా అల్లాహ్ చింతనలో గడుపుతూ వచ్చారు. మానవాళికి ముక్తిమార్గం చూపించేందుకు అల్లాహ్ పంపిన పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరించిన మాసంగా భావిస్తారు. కాగాముందుగా రమదాన్ అనేది ఒక నెల. చాలా వరకు తెలియని వాళ్లు రంజాన్ అంటా రు. ఈ మాసంలో గ్రంథం పఠనానికి ప్రాధాన్యత ఇచ్చారు. తీవ్రమైన ఎండలు, ఉక్కపోతలు ప్రభా వం చూపిస్తున్నా రోజుకు ఐదుసార్లు నమాజ్ చే స్తూ, తమకు ఉన్నదాంట్లో పేదలకు దాన ధర్మాలు చేశారు. అలాగే పలువురు సైతం ముస్లింలకు ఇఫ్తార్లు ఏర్పాటు చేసి సర్వమత సమ్మేళనాన్ని చాటుకొన్నారు. ఇక ముస్లింలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ మాసంలో ముస్లింలతో పాటుగా హిందువులందరూ ఇష్టపడే హలీం, హరీ స్ వంటకాలను అందరూ టేస్ట్ చేశారు. రుచితో పాటు మంచి ఆరోగ్యకరమైన హలీం రుచుల కోసం మరో ఏడాది వేచి చూడాల్సిందే.. ఈ ఉపవాస దీక్ష మనిషిలోని చెడు భావాన్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపుతుందని ముస్లింల నమ్మకం. ఈ మాసంలో స్వర్గం తెరిచి ఉంటుందని నమ్మకం. ఈ మాసంలో చనిపోతే నేరుగా స్వర్గానికి వెళ్తారని వారు భావిస్తారు. అలాంటి పవిత్ర ఉపవాస దీక్షలు నెల రోజులు ముగిశాక రంజాన్ పండుగను ఘనం గా జరుపుకోనున్నారు.
రంజాన్ పండుగ ఏర్పాట్లకు ఆయా మున్సిపాల్టీలు, గ్రామాల్లో అధికారులు, ముస్లిం మత పెద్ద లు, ప్రజాప్రతినిధులతో కలిసి ఏర్పాట్లు చేశారు. ప్రార్థనలు చేసేందుకు ఈద్గాల వద్ద చదును చేయించారు. నీళ్లు, టెంట్లలాంటి ఏర్పాట్లు చేపట్టారు. ప్రత్యేక ప్రార్థన కోసం ముస్లింలు భారీగా హాజరుకానున్నారు. అలాగే ఎమ్మెల్యేలు, ఇతర హిందూ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం పాల్గొని ముస్లింలకు ఈద్ ముబారక్ తెలియజేయనున్నారు. ఈ కారణంగా పోలీసులు సైతం బందోబస్తు ఏర్పాట్లు చేపట్టనున్నారు. మొత్తం మీద పవి త్ర రంజాన్ పండుగను ఘనంగా జరుపుకొనేందు కు ముస్లింలు సిద్ధమయ్యారు.