మిడ్జిల్: గొంతులో మిర్చి బజ్జి ఇరుక్కొని వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని వేముల గ్రామంలో భుధవారం జరిగింది. స్థానికుల కథ నం ప్రకారం హైదరాబాద్లో నివాసం ఉంటున్న మల్లేశ్(40) మంగళవారం రాత్రి తన సొంత గ్రామానికి వచ్చాడు.
రాత్రి ఇంటి మిద్దెపై కూర్చోని హోటల్ నుంచి తెచ్చుకున్న మిర్చి తింటుండగా మిర్చి గొంతుకు అడ్డుపడడంతో మృతి చెందాడు. తెల్లవారుజామున కుటుంబ సభ్యులు మిద్దె పైకి వెళ్లేసరికి మృతి చెంది ఉండడాన్ని గుర్తించారు. హైదరాబాద్లో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం తెలియజేశారు.