రాజాపూర్/మూసాపేట(అడ్డాకుల), నవంబర్ 24 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మి షన్ కాకతీయ, హరితహారం బాగుందని కేంద్ర జలశక్తి అభియాన్ బృందం కితాబిచ్చింది. ఈ పథకంలో భా గంగా చెరువులు, కుంటలను పూడిక తీయడంతో జలవనరులు సమృద్ధిగా పెరిగాయని కేంద్ర జలశక్తి అభియాన్ కన్జ్యూమర్ ఎఫైర్ డిప్యూటీ డైరెక్టర్ ఏకే సింగ్, ఇంజినీర్ విభాగం శాస్త్రవేత్త చేతన్ మోహంతి తెలిపా రు. గురువారం రాజాపూర్ మండల కేంద్రంతోపాటు మూసాపేట మండలం పోల్కంపల్లి, నిజాలాపూర్, అ డ్డాకుల మండల శాఖాపూర్, తిమ్మాయిపల్లి తండాల్లో వారు పర్యటించారు. చెరువుల పూడికతీత, ఉపాధి ప నులు, ఇంకుడు గుంతలు, చెక్డ్యాంలు పరిశీలించారు. వాటికి సంబంధించిన వివరాలు, నిధుల వినియోగంపై ఆరా తీశారు. తిమ్మాయిపల్లి తండాలో ఉపాధి పథకం లో నిర్మించిన లచ్చకుంటను పరిశీలించారు.
కరువు ప్రాంతాన్ని పచ్చబడేలా ఎలా చేశారు.. అందుకోసం చే పట్టిన పనులు, జల వనరుల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూ గర్భ జలాల పెంపునకు గ్రామాల్లో చేపట్టిన పనులు బా గున్నాయని ప్రశంసించారు. నీటి చుక్క ఎంతో విలువైనదని, అందుకే వృథా చేయొద్దని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వారి వెంట అడిషనల్ డీఆర్డీవో జకీయా సుల్తానా, ఎంపీడీవోలు లక్ష్మీదేవి, స్వరూప, మంజుల, ఎంపీవో వెంకట్రాములు, ఏపీవో భారతి, స ర్పంచ్ బచ్చిరెడ్డి, జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధి సిబ్బంది ఉన్నారు.