గద్వాల, డిసెంబర్ 13 : తెలంగాణ ప్రభుత్వంలో విద్యావ్యవస్థకు కేసీఆర్ సర్కార్ పెద్దపీట వేసిందని, సమాజమార్పు విద్యార్థులతో వస్తుందని, ప్రతి విద్యార్థినీ ఉన్నత లక్ష్యంతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎ మ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ఆకాంక్షించా రు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు సరైన స్థలం లేక విద్యార్థినులు అవస్థలు పడుతుండడంతో గ్రహించిన ఎమ్మెల్యే పాఠశాలకు అదనంగా స్థలం కేటాయించడం తో బుధవారం పాఠశాల ఉపాధ్యాయు లు, విద్యార్థినులు కృతజ్ఞత సభను ఏ ర్పాటు చేయగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్లో గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా నియోజకవర్గంలోని గట్టు మండలం దేశంలోనే వెనుకబడి పో యిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను వి డుతల వారీగా అభివృద్ధి చేశానని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలతోపాటు గురుకులాలు, కస్తూర్బాపాఠశాలలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించినట్లు తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లా లో జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వబాలికోన్నత పాఠశాలకు ప్రత్యేకత ఉం దని, విద్యలో మంచి గుర్తింపు పొం దిందన్నారు. పాఠశాలలో చాలామంది గ్రామీణ విద్యార్థినులు చదువుకోవడం తో వారు కూర్చోవడానికి స్థల సమస్య ఉండడంతో ప్రధానోపాధ్యాయుడు స మస్యను తన దృష్టికి తీసుకరావడంతో పాఠశాల పక్కనే ఉన్న ఆర్అండ్బీ స్థలాన్ని కలెక్టర్ సహకారంతో పాఠశాలకు కేటాయించినట్లు తెలిపారు. త్వరలో ఈ స్థలంలో నూతన తరగతి గదులు అన్ని సౌకర్యాలతో నిర్మించి అందుబాటులోకి తెస్తామన్నారు. వి ద్యార్థినుల కోసం పాఠశాలలో త్వర లో నీట్, ఐఐటీకి సంబంధించిన కో చింగ్ ఏర్పాటు చేసే విధం గా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. విద్యార్థినులు శ్రద్ధగా చదువుకొని పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. పాఠశాలలో ఏ స మస్య ఉన్నా తన దృష్టికి తీసుకరావాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం విద్యార్థిను లు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యాక్ర మాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థినులతో సెల్ఫీ, ఉపాధ్యాయులతో గ్రూ ప్ ఫొటో దిగారు.
కేసీఆర్ ప్రభుత్వం కులాంతర వివాహలకు ప్రోత్సాహం అందించిందని, కులాంతర వివాహలు చేసుకున్న జంటలు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో కులాంతర వివాహలు చేసుకున్న మూడు జంటలకు ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రోత్సాహాన్ని బుధవారం ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కులాంతర వివాహలు చేసుకున్న జంటలకు వారి కుటుంబాల నుంచి ప్రోత్సాహం ఉండకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందన్నారు. అలాంటి వారు ఏదో ఒక వ్యాపారం చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభు త్వం ఆర్థికసాయం అందిస్తుందన్నారు. ప్రభుత్వం అందించే సాయాన్ని జంట లు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతమై అందరికీ ఆదర్శంగా నిలవాలని సూచించా రు. ప్రోత్సాహాన్ని అందుకున్న వారిలో మల్దకల్ మండలపరిధిలోని అమరవాయి గ్రామానికి చెందిన సమ్రీన్, గద్వాల పట్టణానికి చెందిన పుష్పలత, భర్త శివకుమార్, దీపిక ఆమె భర్త చంద్రయ్యకు ఒక్కొక్కరికీ రూ.2.50లక్షల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ కేశవ్, ఎంపీపీ విజయ్కుమార్, డీఈవో సిరాజుద్దీన్, కౌన్సిలర్ శ్రీరాములు, నాయకులు గో విందు, ధర్మనాయుడు, వెంకటన్నగౌ డ్, కృష్ణారెడ్డి, ప్రధానోపాధ్యాయిడు రా జానందం, ఉపాధ్యాయుడు జహీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.