మహబూబ్నగర్, జనవరి 9 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన కార్యక్రమం ద్వారా ప్రతిఒక్కరి కంటికి వెలుగును అందించాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఈ నెల 18 నుంచి ప్రారంభం కా నున్న కంటివెలుగు కార్యక్రమంపై సోమవారం నూతన కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద కంటి పరీక్ష కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ అంధత్వంతో బాధపడకూదనే ఉ ద్దేశంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. మొ దటి విడుతలో ఉన్న పొరపాట్లను సవరించుకొని రెండో విడుతను సక్సెస్ చేయాలన్నారు. మహబూబ్నగర్ జిల్లాకు ఇప్పటికే 40 వేల రీడింగ్ అద్దాలు వచ్చాయన్నారు. ప్రిస్క్రిప్షన్ అద్దాలు ఇవ్వడంతోపాటు అవసరమైన వారికి కాటరాక్ట్ ఆపరేషన్లు కూడా చేస్తామన్నారు. ప్రజలకు తెలంగాణ సర్కార్ ఎప్పుడూ అండగా ఉం టుందన్నారు. అన్నివర్గాల ప్రజలను సమాన దృష్టితో చూస్తున్నట్లు వివరించారు.
గ్రామం నుంచి పట్టణస్థాయి వరకు కంటివెలుగు కార్యక్రమంపై విస్తృత ప్ర చారం చేయాలని సూచించారు. సర్పంచులు, ప్రజాప్రతినిధులు, గ్రామ, మండలస్థాయి అధికారులు దృష్టిలో పం ఉన్న వారిని గుర్తించాలన్నారు. ఎమ్మెల్యేలతో చ ర్చించిన అనంతరం అద్దాలు పంపిణీ చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని సూచించా రు. అందరికీ తెలిసేలా పెద్ద ఎత్తున హోర్డింగ్లను ఏర్పా టు చేయడంతోపాటు కరపత్రాలను పంపిణీ చేయాలన్నారు. అనంతరం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అధికారులు తప్పనిసరిగా కంటి వెలుగు శిబిరాలను సందర్శించాలన్నారు. గ్రామాల్లో కంటివెలుగు నిర్వహించే తేదీలను టాంటాం వేయాలన్నారు. జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గొప్ప ఉద్దేశంతో కంటివెలుగు కార్యక్రమానికి అంకుర్పారణ చేశారని, దీని ద్వారా ఎంతోమంది పేదలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
కలెక్టర్ వెంకట్రావు మాట్లాడు తూ ఈ నెల 12వ తేదీలోగా భారీఎత్తున ప్రచారం చే యాలన్నారు. అవసరమైన సామగ్రిని గ్రామాలకు చే ర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 8 మంది సిబ్బంది ఒక టీంగా ఉంటారని, వారికి అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలన్నారు. మండల అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించామన్నారు. స్వయం సహాయక మహిళ, మెప్మా బృందాలను భాగస్వామ్యం చేయాలని, దీనిపై డీఆర్డీవో, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సమావేశంలో గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వాల్యానాయక్, డీసీసీబీ అధ్యక్షుడు నిజాంపాషా, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, అదనపు కలెక్టర్లు తేజస్నందలాల్పవార్, సీతారామారావు, మున్సిపల్ చైర్మన్లు నర్సింహులు, బసవరాజుగౌడ్, లక్ష్మి, డీఎంహెచ్వో కృష్ణ, ఆర్డీవో అనీల్కుమార్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.