ధరూర్, డిసెంబర్ 13 : జూరాల ప్రాజెక్ట్కు ఎగువ నుంచి ఇన్ఫ్లో పూర్తి తగ్గిపోతున్నది. బుధవారం 592 క్యూ సెక్కుల ఇన్ఫ్లో వస్తుండడా, 1935 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. నెట్టెంపాడు లిఫ్ట్కు 750 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-1కు 392 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 325 క్యూసెక్కులు, కుడి కాల్వకు 401 క్యూసెక్కులు, ఆర్డీఎస్ కెనాల్కు 300క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ నీటిమట్టం 7.971టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.264 టీఎంసీల నీటిమట్టం ప్రాజెక్ట్లో నిల్వ ఉన్నది.
అయిజ, డిసెంబర్ 13 : కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద స్వల్పంగా కొనసాగుతున్నది. బుధవారం ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్ఫ్లో 239 క్యూసెక్కులు చేరుతుండగా, ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 412 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 7.8 అడుగుల మేర నీటిమట్టం ఉన్న ట్లు ఆర్డీఎస్ ఏఈ రాందాస్ తెలిపారు. తుమ్మిళ్ల పథకం పంప్ ద్వారా నీటి వి డుదల కొనసాగుతుందన్నారు.
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంలో నీటి మట్టం 11 టీఎంసీలకు చేరుకున్నది. బుధవారం ఇన్ఫ్లో 490 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 1,786 క్యూసెక్కులు ఉంది. 105.788 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం కలిగిన డ్యాంలో ప్రస్తుతం 11.939 టీ ఎంసీల నీటి నిల్వ ఉంది. 1,633అడుగుల గరిష్ఠ నీటిమట్టానికి గానూ, ప్రస్తుతం 1,591.06 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు డ్యాం సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు.