నారాయణపేట, మార్చి 14 : భారత్-చైనా సరిహద్దు వద్ద తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పోస్టర్ను ప్రదర్శించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులైన న్యాయవాదులు రవికుమార్ (నారాయణపేట), లక్ష్మీనారాయణ (బాపన్పల్లి) సిక్కిం రాష్ట్రంలోని గ్యాంగ్టక్ సమీపంలోని నాతులపాస్ వద్ద కేసీఆర్ ఫొటోను ప్రదర్శించారు.
గజగజ వణికే చలిలో భారత్ మాతాకీ జై, తెలంగాణ బాపు కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.