నవాబ్పేట, ఫిబ్రవరి 12 : నాకు అప్పుల బా ధలు అధికమయ్యాయి.. నేను చనిపోతున్నాను.. మా అమ్మను మంచిగా చూసుకోండి..అంటూ అమ్మాపూర్ గ్రామానికి చెందిన నర్సింహాచారి(27) తన స్నేహితుడికి ఫోన్లో సమాచారం ఇచ్చి ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఎస్సై అభిషేక్రెడ్డి కథనం మేరకు.. మండలంలోని అమ్మాపూర్ గ్రామానికి చెందిన నర్సింహాచారి అప్పులు చేసి గ్రామంలోనే ఇల్లు కట్టాడు. కాగా ఇటీవల నర్సింహాచారికి అప్పు ల బాధలు అధికం కావడంతో రాత్రి ఇంట్లో ఎవ రూ లేని సమయంలో తన స్నేహితుడు నర్సింహులుకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానని, తన అ మ్మ గీతమ్మను మంచిగా చూసుకోవాలని చెప్పి.. ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. గ్రామంలో అందరి తో కలివిడిగా ఉండే నర్సింహాచారి ఆత్మహత్యతో అమ్మాపూర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కాగా 15 ఏండ్ల కిందట నర్సింహాచారి తండ్రి శ్రీ నివాసాచారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. భర్త, కుమారుడు మృతి చెందడంతో గీతమ్మ అనాథగా మారింది. నర్సింహాచారి తల్లి గీతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై అభిషేక్రెడ్డి తెలిపారు.