మాగనూరు, ఫిబ్రవరి 7: మండలంలోని ఓ గ్రామంలో మైనర్ బాలిక లైంగికదాడికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల వివరాల ప్రకారం బాలిక నివాస స్థలం సమీపంలో పాడుబడ్డ ఇండ్లు ఉన్నాయని, మధ్యాహ్నం అటు నుంచి వెళ్తున్న బాలికను అదే గ్రామానికి చెందిన వ్యక్తి(23) బాలికను పాడుబడ్డ ఇండ్లలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడినట్లు తెలిపారు.
బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మల్లేశ్ తెలిపారు.