మహబూబ్నగర్ అర్బన్/భూత్పూర్, జూలై 16 : రాష్ట్రంలో బ్రాహ్మణుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని క్రీడా శాఖ మంత్రి శ్రీ నివాస్గౌడ్ అన్నారు. భూత్పూర్ ము న్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ వాస వీ ఫంక్షన్ హాల్లో పాలమూరు జిల్లా బ్రాహణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞతా పూర్వక అభినందన సభ, బ్రాహ్మణ కుటుంబ ఆత్మీయ స మ్మేళనానికి మంత్రి సతీసమేతంగా హాజరయ్యారు. వీరికి బ్రాహ్మణులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వదించా రు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో బ్రాహ్మణులకు సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి తెలిపారు.
ఇచ్చిన మాట ప్రకారం బ్రాహ్మణుల ఆత్మగౌరవం నిలిపేలా హైదరాబాద్లో ఆరెకరాల స్థలంలో రూ.12కోట్లతో బ్రాహ్మణ భవనం నిర్మించారని పేర్కొన్నారు. బ్రాహ్మణులకు అన్నివిధాలా అండగా నిలిచామని తెలిపారు. పేద బ్రాహ్మణ విద్యార్థులు విదేశాలకు వెళ్లేందుకు ఓవర్సీస్ స్కాలర్షిప్ అందించి అండగా నిలిచామన్నారు. జిల్లా కేంద్రంలో వేద పాఠశాలకు రెండున్నర ఎకరాల ప్ర భుత్వ స్థలాన్ని అందజేసి పాఠశాల ని ర్మాణానికి తమవంతు సహకారం అం దించామన్నారు. నియోజకవర్గంలో సుమారు వందకు పైగా ఆలయాల అభివృద్ధి కోసం నిధులు, స్థలాలు అందించినట్లు తెలిపారు.
రాష్ట్రంలోనే మొట్టమొదటి రోప్వే మన్యంకొండ దేవస్థానం వద్ద నిర్మిస్తున్నామని, అక్కడే రూ.15 కోట్లతో వేంకటేశ్వర కల్యాణ మండపం బడ్జెట్ హోటల్ సైతం అందుబాటులోకి వస్తుందన్నారు. పురాతన లక్ష్మీ నర్సింహస్వామి ఆలయాన్ని అద్భుతంగా పునరుద్ధరించామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలకు మరింత మెరుగైన పాలన అం దించేందుకు బ్రాహ్మణుల ఆశీర్వాదం కావాలని కోరా రు. కులమతాలకు అతీతంగా శాంతి సామరస్యాలతో మహబూబ్నగర్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ సేవా సమితి గౌరవ అధ్యక్షుడు గోపాల్శర్మ, అధ్యక్షుడు బీమాచార్యులు, రాఘవేంద్రశర్మ, శ్రీ కాంత్శర్మ, వెంకట్కిషన్రావు, శ్రీనివాసచార్యులు పాల్గ్గొన్నారు.
తెలంగాణలో యూనివర్సిటీలకు మహర్దశ..
పాలమూరు, జూలై 16 : తెలంగాణ ఏర్పాటు తర్వాతే యూనివర్సిటీలకు మహర్దశ వచ్చిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ సమీపంలోని పాలమూరు యూనివర్సిటీలో రూ.10కోట్ల వ్య యంలో సెంట్రల్ రీసెర్చ్ ఫెసిలిటీ బి ల్డింగ్ నిర్మాణానికి ఆయన ఆదివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు యూనివర్సిటీ పేరును సురవరం ప్రతాపరెడ్డి యునివర్సిటీగా మార్చబోమని, ప్రజలకు, విద్యార్థులకు వ్యతిరేకంగా ఎలాంటి పనిచేయబోమని మంత్రి స్పష్టం చేశారు. కార్యక్రమంలో పీయూ రిజిస్ట్రార్ గిరిజామంగతాయారు, ఓఎస్డీ మధుసూదన్రెడ్డి, ప్రొఫెసర్ పవన్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారికి పూజలు..
జిల్లా కేంద్రంలోని అశోక్ టాకీస్ చౌరస్తా సమీపంలో ఉన్న అమ్మాభవాని ఆలయంలో ఆషాఢ పూజా మహోత్సవంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కౌన్సిలర్ రాంలక్ష్మణ్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరికలు..
జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం హన్వాడ మండలం దొర్రితండాకు చెందిన బీజేపీ మండల ఎస్టీసెల్ అధ్యక్షుడు జుక్యానాయక్, గ్రామ కమిటీ అధ్యక్షుడు వెంకటేశ్, పాండ్యానాయక్, సురేశ్నాయక్, నాన్యనాయక్, శంకర్నాయక్, రవినాయక్తోపాటు 80మంది, పులుపోనిపల్లికి చెంది న బీజేపీ నాయకులు గొల్ల లాలయ్య, అంజయ్య, మల్లేశ్, కృష్ణయ్యతోపాటు 20మంది, మాల దాసరి కమ్యూనిటీ సంక్షేమ సంఘం జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి మల్లేశ్, వెంకట్రాములు, నరసింహా, కుర్మన్నతోపాటు 50మంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, జెడ్పీటీసీ విజయనిర్మల, రమణారెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మీమోహన్ నాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరుణాకర్గౌడ్, సర్పంచ్ ఉష, జాగృతి రమేశ్ తదితరులు పాల్గ్గొన్నారు.