మక్తల్ టౌన్, జనవరి 18 : అంధత్వ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం అ త్యంత ప్రతిష్ఠాత్మకంగా కంటి వెలుగు రెం డో విడుత కార్యక్రమాన్ని చేపట్టింది. మం డలంలోని గుడిగండ్ల పల్లె దవాఖానలో ఏ ర్పాటు చేసిన శిబిరం వద్ద కంటి పరీక్షలను గురువారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. మక్తల్ మండలంలో 39 గ్రామ పంచాయతీలు, బల్దియాలోని 16 వార్డుల్లో కంటి పరీక్షలు చే సేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూ ర్తి చేశారు. కర్ని పీహెచ్సీలో డాక్టర్ తిరుప తి సారథ్యంలో పరీక్షలు చేయనున్నారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు కంటి పరీక్షలు చేసేందుకు గుడిగండ్ల, మం థన్గోడ్లో రెండు బృందాలను ఏర్పాటు చేశారు. మక్తల్ మున్సిపాలిటీలోని 16వ వార్డులో ఉన్న లయన్స్ క్లబ్ ఆవరణలో కంటి వెలుగు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వీటితోపాటు ఆయా గ్రామపంచాయతీ, అంగన్వాడీ కేంద్రాల వద్ద కూడా కంటి పరీక్షలు చేయనున్నారు. మక్తల్ మండలానికి 1,500 అద్దాలు, మందులు వచ్చిన ట్లు కంటి వెలుగు ప్రోగ్రాం అధికారి డాక్టర్ తిరుపతి తెలిపారు.