ధాన్యం కొనేందుకు ప్రభుత్వం కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆరుగాలం కష్టించి పండించిన రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో యాసంగిలో 69,827 ఎకరాల్లో వరి సాగు కాగా.. 1.77 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందనిఅధికారుల అంచనా.. కొనుగోలు కోసం 72 కేంద్రాలు అవసరం ఉండగా.. ప్రస్తుతానికి 37 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 209 మంది రైతుల నుంచి 1,554 మెట్రిక్ టన్నులు సేకరించారు. దళారుల వ్యవస్థకు పూర్తిగా చెక్ పడడంతోపాటు దూర ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయించే ప్రయాస అన్నదాతలకు తప్పింది. దీంతోపాటు మద్దతు ధర లభిస్తుండడంతో కర్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గద్వాల, మే 18 : రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా.. మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. ఏటా ఐకేపీ, పీఏసీసీఎస్, వ్యవసా య మార్కెట్ల ద్వారా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ధాన్యం సేకరిస్తున్నది. ఈ కేంద్రాలకు రైతుల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో ధాన్యపు రాసుల ను తలపిస్తున్నాయి. ఏ గ్రేడ్ రకానికి రూ.2,060, సాధారణ రకానికి రూ.2020 మేర మద్దతు ధర చెల్లిస్తునారు. గతంలో రైతులు ధాన్యం విక్రయించాలంటే నానా అవస్థలు పడేవారు. కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో రైతులకు రవాణా ఖ ర్చుల బాధలు కూడా తప్పాయి.జోగుళాంబ గద్వాల జిల్లాలో యా సంగి సీజన్లో రైతులు 69,827 ఎకరాల్లో వరి సాగు చేయగా.. 1.77 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు జిల్లాలో 72 కేంద్రాలు అవసరం కాగా, ప్రస్తుతం 37 కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పుడిప్పుడే రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తుండడంతో అవసరాన్ని బట్టి మరిన్ని సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 209 మంది రైతుల నుంచి 1,554 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కేంద్రాల్లో రైతులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. గతంలో కొ నుగోలు కేంద్రాలు లేకపోవడంతో.. గ్రామాల్లో దళారులు చెప్పిన ధ రకు ఇష్టం ఉన్నా లేకపోయినా విక్రయించేవారు.దీనికితోడు దళారులు ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా ఉడాయించి న సంఘటనలు కూడా ఉన్నాయి. వీటన్నింటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుతో చెక్ పడింది. రైతులు నేరుగా ట్రాక్టర్లలో ధాన్యం పోసుకొని కేంద్రాలకు తీసుకొస్తున్నారు. దీంతో ధాన్యాన్ని సంచులకు నింపే ప్రయాస కూడా తప్పింది. రాయిచూర్, గద్వాల వంటి మార్కెట్లకు వెళ్లి ధాన్యాన్ని విక్రయిం చే బాధ కూడా లేదు. ఊళ్లోనే కేంద్రాల ఏర్పాటుతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తూకాల్లో మోసాలకు తావులేకుండా హమాలీల ద్వారా కాంటా వేయిస్తున్నారు. దీంతో కూలీలకు హ మాలీ ద్వారా ఉపాధి లభిస్తుంది. రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ అయ్యే వరకు అధికారులు పూర్తి స్థాయి బాధ్యత వహిస్తున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లిస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.