మహబూబ్నగర్ టౌన్, ఫిబ్రవరి 29 : మున్సిపాలిటీ ఆస్తిపన్ను బకాయిదారులకు ప్రభుత్వం బం ఫర్ ఆఫర్ ఇచ్చింది. వన్టైమ్ సెటిల్మెంట్ స్కీం (ఓటీఎఫ్) కింద 2022-23 మార్చి చివరి నాటికి ఉన్న ఆస్తి పన్ను బకాయిల్లో అసలును ఈ ఏడాది మార్చి 31వ తేదీలోగా చెల్లిస్తే 90శాతం వడ్డీని మా ఫీ చేయాలని నిర్ణయించింది. 2023 ఆర్థిక సంవత్సర బకాయిలను వడ్డీతోపాటు ప్రస్తుత ఆర్థిక సం వత్సరంలో చెల్లించని పక్షంలో 90శాతం వడ్డీ రా యితీ మొత్తాన్ని తరువాత సంవత్సరంలో చెల్లించాల్సిన ఆస్తి పన్నుల్లో సర్దుబాటు చేస్తామని పురపాలిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈ పథకంతో పేరుకుపోయిన మొండిబకాయిలు వసూలు కా నుండగా, బల్దియాలకు మరింత ఆదాయం చేకూరనున్నది. దీంతో మహబూబ్నగర్, భూత్పూర్, జడ్చర్ల మున్సిపాలిటీలో పన్ను వసూలు పెరగనున్నది. మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 20 వేలకుపైగా ఇండ్ల యాజమానులకు లబ్ధి చేకూర్చే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
గతేడాది దాదాపు రూ.4కోట్ల బ కాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికి దాదాపు రూ.12కోట్లకుపైగా పన్ను వసూలు చేశారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో దాదాపు 25వేల మందికి లబ్ధి కలుగుతుంది. ఈ పథకాన్ని వినియోగించుకుంటే మున్సిపాలిటీలకు ఆదాయం వచ్చే అ వకాశముంది. ఆస్తిపన్ను వడ్డీ రాయితీపై మెసేజ్లు, అవగాహన, చైతన్య సదస్సుల ద్యారా విస్తృత ప్ర చారం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే రెవెన్యూ అధికారులు ప్రత్యేక బృం దాలుగా ఏర్పడి ఆస్తి పన్ను వసూలుపై దృష్టి సారించారు. మార్చి 31 వరకు ఆస్తి పన్ను బకాయిదారు లు పన్ను చెల్లించి 90 శాతం రాయితీ పొందాలని, పురపాలిక అభివృద్ధికి సహకరించాలని మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి కోరుతున్నారు.