పాలమూరు, డిసెంబర్ 19: పేదప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడారు. మెరుగైన వైద్యం అంందించడంలో దేశంలోనే తెలంగాణ నెంబర్వన్ అని అన్నారు. నియోజకవర్గంలో 64మంది లబ్ధిదారులకు రూ.56.03 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, చైర్మన్ కేసీ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్హ్రమాన్, హన్వాడ ఎంపీపీ బాలరాజు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ మర్రి లక్ష్మారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి బాలబాలికలు, మాస్టర్స్ పారాయోగాసన ఛాంపియన్షిప్ 2022లో ఉమ్మడి జిల్లాకు చెందిన క్రీడాకారులు 6గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్, 1బ్రాంజ్మెడల్ను సాధిం చి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. జెడ్పీ కార్యాలయంలో యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని క్రీడాకారులను మంత్రి అభినందించారు. అలాగే పట్టణలంలోని శ్రీనివాసకాలనీలో కేశవ్గౌడ్ నివాసంలోని అయ్యప్ప స్వామి పడిపూజకు మంత్రి పాల్గొని ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వాములకు భిక్ష వడ్డించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ప్రవీణ్కుమార్, అన్వేష్గురుస్వామి, అయ్యప్పస్వాములు, భక్తులు పాల్గొన్నారు.