ఎర్రవల్లి చౌరస్తా, జూన్ 5 : ఈత సరదా వారి ప్రాణాలను కబళించింది. కృష్ణానదికి స్నానానికి వెళ్లిన నలుగురు మృతి చెందిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. పోలీసులు, మృతుల బంధువుల కథనం మేరకు.. ఇటిక్యాల మండలం వల్లూరుకు చెందిన ఇబ్రహీం(ఆటో డ్రైవర్), ఇస్మాయిల్ (బన్నుల వ్యాపారం) అన్నదమ్ములు. అయితే ఉపాధి కోసం ఏపీలోని కర్నూల్కు వెళ్లి జీవిస్తున్నారు. ఇబ్రహీంకు ఇద్దరు కూతుళ్లు ఆఫ్రిన్(17), నౌషిన్(13), ఇస్మాయిల్ కొడుకులు సమీర్ (18), రెహాన్(13). అయితే వేసవి సెలవు లు కావడంతో 8రోజుల కిందట బోరవెళ్లికి రెండు కు టుంబాలు వచ్చాయి.
ఇబ్రహీం, ఇస్మాయిల్ సోదరి బోరవెళ్లిలో ఉంటుంది. అక్కడికొచ్చిన చిన్నారులు సోమవా రం ఉదయం 11 గంటలకు అత్త కొడుకు ఇమామ్ (15) తో కలిసి 9 మంది మంగపేట సమీపంలోని కృష్ణానది వద్దకు ఆటోలో వెళ్లారు. అక్కడ నదిలో స్నానం చేసేందుకు ఐదుగురు నీటిలోకి దిగగా.. మరో నలుగురు చిన్నారులు ఒడ్డుపై ఉన్నారు. రెహాన్ నీటిలో మునుగుతుండగా.. కాపాడేందుకు వెళ్లిన ఆఫ్రిన్, నౌషి న్, సమీర్ నీట మునిగి మృతి చెందారు. ఇమామ్ తృటి లో తప్పించుకున్నాడు. ఆదివారం రోజే ఆఫ్రిన్కు నిశ్చితార్థం జరగడం.. అంతలోనే విషాదం చోటు చేసుకోవడంతో కు టుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.