మాగనూరు, మార్చి 22 : పదేండ్లలో ఎన్నడూ చూడని కరువు ప్రస్తుతం రైతుల కంట్లో కన్నీరు తెప్పిస్తున్నది. ఎంతో ఆశతో యాసంగి పంటసాగు చేయగా, సాగునీరు మధ్యలోనే నిలిచిపోయి భూగర్భజలాలు అడుగంటిపోయి వరిపంట ఎండిపోతున్నది. మాగనూరు మం డల కేంద్రంలో ప్రస్తుతం పొట్టదశలో ఉన్న వరి పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. మండల కేంద్రానికి చెందిన రైతు ఉజ్జెల్లి ఆంజనేయులు మూడెకరాలు కౌలుకు తీసుకొని వరిసాగుచేశాడు.
సంగంబండ రిజర్వాయర్ నుంచి వచ్చే సాగునీరు ద్వారా పంటలు పండించుకోవచ్చని సాగు చేయగా, ప్రస్తుతం చుక్కనీరు రాకపోవడంతో ఏం చే యాలో పాలుపోని పరిస్థితిలో పడిపోయాడు. పంట పొట్ట దశకు వచ్చి కండ్లముందే ఎండిపోతుంటే నీటి కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఎలాగైనా పంటను కాపాడుకోవాలని కిలోమీటరు మేర పైపుద్వారా నీటిని పంటకు పారించే ప్రయత్నం చేస్తున్నాడు. పంటకు రూ.80వేల ఖర్చు చేశానని, పంట ఎండిపోతుండడంతో పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదని వాపోతున్నాడు.